వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవిపై ప్రేమ కురిపించిన బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
శాసనసభ్యుడు చిరంజీవికి కాంగ్రెసు పార్టీలో అన్ని వైపుల నుంచీ ఆదరణ పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. ఆయన కాంగ్రెసులో అందరివాడిలా మారే అవకాశాలున్నాయి. సోమవారం శాసనసభలో ఆయన చివరి బెంచీలో కూర్చున్నారు. తనకు ముందు బెంచీపై మక్కువ అనే ఊహాగానాలు చెలరేగుతుండడంతో దాన్ని తొలగింపజేసుకునేందుకు ఆయన వెనక బెంచీకి వెళ్లినట్లు కనిపిస్తోంది. అయితే ఆయనపై మంత్రి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మరో మంత్రి కన్నా లక్ష్మినారాయణ అవ్యాజమైన ప్రేమను కురిపించారు.

వెనక బెంచీలో కూర్చున్న చిరంజీవి వద్దకు వెళ్లి వారిద్దరు ముందు వరుసలోకి తీసుకుని వచ్చారు. చిరంజీవిని తమ ఇద్దరి మధ్య కూర్చో బెట్టుకుని తమ అభిమానాన్ని ప్రకటించుకున్నారు. చిరంజీవికి కాంగ్రెసులో తగిన గౌరవం, ప్రేమ ఉంటుందని వారు చెప్పకనే చెప్పారు. ఏమైనా, కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడం వల్ల టెన్షన్ తగ్గడంతో పాటు చిరంజీవికి అభిమానం కూడా పెరిగినట్లు అనిపిస్తోంది.

English summary
Chiranjeevi has tasted the affection of ministers botsa Satyanarayana and Kanna Laxminarayana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X