వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ దెబ్బ: మళ్లీ కెసిఆర్ ఫాంహౌస్ స్కెచ్చులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్లీ ఫాంహౌస్ వ్యూహాలకు తెరతీశారట. ఇటీవల నెల రోజుల పాటు ఢిల్లీలో కాంగ్రెసు పార్టీ పెద్దలతో తెలంగాణపై చర్చలు జరిపిన కెసిఆర్ ఆ తర్వాత మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లోని తన ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు. అప్పటి నుండి ఆయన అక్కడే ఉంటున్నట్లుగా సమాచారం. అక్కడ తెలంగాణపై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మూడు నెలల క్రితం దసరా పండుగలోగా తెలంగాణ వస్తుందని బల్లగుద్ది మరీ చెప్పారు. తనకు అలా అని సంకేతాలు ఉన్నాయన్నారు. అయితే ఢిల్లీ పెద్దలు మాత్రం తెలంగాణపై ఇప్పట్లో తేల్చలేమని ఇటీవల కాలంలో పలుమార్లు చెప్పడంతో కెసిఆర్ చిక్కుల్లో పడ్డారు. దీంతో అతను ఇప్పుడు కాంగ్రెసు పార్టీకి మరోసారి ఉద్యమ వేడిని తగిలించాలని చూస్తున్నారట. అందుకోసం ఆయన పలువురు నేతలను, తెలంగాణవాదులను తన ఫాంహౌస్‌లో కలుస్తూ వ్యూహరచనలు చేస్తున్నారట.

సొంత పార్టీ నేతలు మాత్రమే కాకుండా తనకు అనుకూలంగా ఉన్న పలువురు తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నేతలు ఇతరులతోనూ ఆయన జోరుగా సుదీర్ఘ చర్చలు కొనసాగిస్తున్నారట. ఢిల్లీ నుండి వచ్చాక కెసిఆర్ మాట్లాడుతూ.. అంతా బాగానే జరిగిందని చెప్పారు. కానీ కేంద్రమంత్రులు తెలంగాణపై ఆలోచించడం లేదని చెప్పడంతో ఇప్పుడు ఆయనకు ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు. అందుకే ఇక కాంగ్రెసు పైన ఉద్యమకార్యాచరణ రూపొందించాల్సిందేనని ఆయన భావిస్తున్నారని అంటున్నారు.

English summary

 Back in Hyderabad from New Delhi trip after holding consultation with central leaders, TRS chief K Chandrasekhar Rao has once again gone for a retreat to his Farm House near Jagdevpur in Medak district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X