వైయస్ విజయమ్మకు 'పొలిటికల్' ట్రయినింగ్

జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దూకుడుగా వెళుతుండటంతో ఏ క్షణంలోనైనా యువనేతను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఎ-1 నిందితుడిగా పేర్కొన్న జగన్ను సిబిఐ అరెస్టు చేయవచ్చునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోనూ ఆందోళన ఉందట. దీంతో ఒకవేళ జగన్ అరెస్టయితే పార్టీ పగ్గాలు చేపట్టేందుకు వైయస్ విజయమ్మను సంసిద్ధం చేయాలని ఆ పార్టీ వర్గాలు భావించాయట.
ఇందుకోసం ఆమెకు పొలిటికల్ ట్రయినింగ్ ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ అరెస్టయినా పార్టీని ఏకతాటి పైన నడుపుతూ, ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఆమెకు ట్రయినింగ్ ఇప్పిస్తున్నారని అంటున్నారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులతో ఆమెకు ఈ ట్రయినింగ్ ఇప్పిస్తున్నారట. సమావేశాల్లో ఎలా మాట్లాడాలి? బహిరంగ సభల్లో మాట్లాడాల్సిన తీరు, ప్రజలతో ఎలా నడుచుకోవాలి? తదితర అంశాలపై నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారని అంటున్నారు.
దీంతో అనుకోని పరిస్థితులు ఎదురైతే విజయమ్మ జగన్ తరహా ఓదార్పు యాత్రలు నిర్వహిస్తారా? తన పదునైన ప్రసంగాలతో ప్రజలను ప్రభావితం చేస్తారా? అనే చర్చ జరుగుతోందంట. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆమె బయటకి వచ్చిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు ఆమె తన నియోజకవర్గం పులివెందుల ప్రజలతో పూర్తిగా మమేకం అవుతాన్నారట.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications