గాలి బెయిల్ నిందితుల వసతులకోసం రూ.కోటీ డీల్?
సోమశేఖర రెడ్డి, సురేష్బాబు, దశరథరామి రెడ్డి తదితరులకు భోజనం, ప్రత్యేక వసతుల కోసం జైలు సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఇద్దరు ఉప పర్యవేక్షాణాధికారులు, గేటు ఇన్చార్జితో కోటి రూపాయల డీల్ కుదుర్చుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ముందుగా సోమశేఖర రెడ్డి మధ్యవర్తులుగా ఉన్న జైలర్కు, ఉప పర్యవేక్షాణాధికారికి 25లక్షల రూపాయలు ముట్టచెప్పారట! మానస సరోవర్ బ్యారక్లో కొద్దిరోజుల క్రితం పర్యవేక్షణాధికారి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో చేసిన తనిఖీల్లో సోమశేఖర్ రెడ్డి నుంచి 15వేల రూపాయలు స్వాధీనం చేసుకొన్న విషయం తెలిసిందే.
అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో తమపై కేసులు పెట్టారని, డబ్బులు దొరక్కపోయినా స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం చేస్తున్నారని సూపరింటెండెంట్తో సోమశేఖర్ రెడ్డి, సురేష్ బాబు వాగ్వివాదానికి దిగారని తెలుస్తోంది. సోమశేఖర్ రెడ్డి తదితరులు బెయిల్ కోసం తమ అనుచరులతో అధికారుల చాంబర్లలోనే చర్చలు జరుపుతున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.
విఐపి ఖైదీల ములాఖత్ల ముసుగులో అధికారులు లక్షలాది రూపాయలను తమ జేబుల్లో వేసుకుంటున్నారని జైళ్ల శాఖ ఐజికి పలు ఫిర్యాదులు అందుతున్నాయట! గాలి బెయిల్ డీల్ కోసం ఇప్పటికే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేందుకు ప్రయత్నించడంతో ఇప్పుడు అదే కేసు నిందితుల కోసం జైలు అధికారులు ఏమైనా చేస్తున్నారా అని ఎసిబి నిఘా పెట్టిందట.