'వైయస్' జగన్ ఫ్యామిలీ వెలి!

ఇలా వరుస ఆరోపణలకు తోడు క్రైస్తవ ఛారిటబుల్ ఫౌండేషన్ను దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ వైయస్ కుటుంబాన్ని రాష్ట్రవ్యాప్తంగా దళిత క్రైస్తవుల నుంచి వెలేస్తున్నట్లు తెలంగాణ క్రైస్తవ సంఘాల సమాఖ్య కన్వీనర్ మత్తయ్య అన్నారు. అవినీతి ఆరోపణలు, అక్రమ ఆస్తులు, నిధుల దుర్వినియోగంతో పాటు.. వైయస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ మత సంస్థల పేరుతో కోట్లాది రూపాయల నిధులను మళ్లించడం దారుణమని అన్నారు.
అగస్టా హెలికాప్టర్ కొనుగోలు కుంభకోణం ఉదంతంలో క్రైస్తవ మిషనరీ సంస్థ ఆర్బోర ఫౌండేషన్కు పాత్ర ఉండడం విచారకరమని ఆరోపించారు. వైయస్ పాలనలో ప్రత్యక్షంగా ఆర్బోరాను వినియోగించుకోవడం నిజమైన క్రైస్తవులు సిగ్గుతో తలదించుకునేలా చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవకతవకలకు నిరసనగా త్వరలో ఇందిరాపార్క్ వద్ద పదివేల మందితో ధర్నా చేయనున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications