వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యల నుంచి భద్రత కావాలట..

By Pratap
|
Google Oneindia TeluguNews

wives
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విచిత్రమైన సమావేశం జరిగింది. భార్యల చేతుల్లో వేధింపులకు గురయ్యే భర్తలు ఒక్క చోట కూడారు. భార్యా బాధితుల సంఘం బ్యానర్ కింద వారంతా ఒక్కటయ్యారు. తమ హక్కుల కోసం నినదించారు.

మహిళలకు మాదిరిగానే తమకు కూడా రక్షణ కల్పించాలని, మహిళా చట్టాల పేరుతో పురుషుల హక్కులను కాలరాయడం దారుణమని భార్యా బాధితుల రాష్ట్ర సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం ఈ సమావేశం జరిగింది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన భార్యాబాధితులు తమ ఆవేనదను వెళ్లగక్కారు. రెండు రోజులపాటు జరిగే సమావేశాల తొలి రోజున భార్యలు, వారి కుటుంబ సభ్యుల నుంచి ఏ విధంగా వేధింపులను ఎదుర్కుంటున్నామనే విషయాలను పంచుకున్నారు.

త్వరలో రాష్ట్ర కార్యవర్గాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయనున్నట్టు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల రామకృష్ణ తెలిపారు. 498(ఏ) యాక్టుని సవరించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యదర్శిగా గొలుగూరి బాల చంద్రశేఖరరెడ్డిని ఎంపికయ్యారు.

English summary
The men, who are the victims of their wives met at Tadepallygudem in West Godavari to achieve their demands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X