సమైక్య సెంటిమెంట్: లగడపాటికి నో జగన్కు ఓకే

అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, మంత్రి గంటా శ్రీనివాస రావు వంటి వారు సీమాంధ్రలోనూ సెంటిమెంట్ బలంగానే ఉందని చెబుతున్నారు. అయితే రాష్ట్ర విభజన జరగదనే భావనతో తమ ప్రాంత ప్రజలు ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నారని, అదే జరిగితే ఉద్యమం ఎగిసిపడుతుందని చెబుతున్నారు. అయితే అలాంటిదేమీ లేదని మరికొందరు కొట్టి వేస్తున్నారు. అందుకు ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. సీమాంధ్రలో సమైక్య సెంటిమెంట్ బలంగా ఉంటే.. 2004లో కాంగ్రెసు, 2009లో టిడిపి తెరాసలు పొత్తు ఎలా పెట్టుకున్నాయని, అప్పుడు ఆ ప్రాంత నేతలు ఎందుకు అడగలేదంటున్నారు.
2009 డిసెంబర్ 9వ తేదిన తెలంగాణపై ప్రకటన వచ్చినప్పుడు కూడా సీమాంధ్ర నేతలో హడావిడిగా స్పందించారు తప్ప ప్రజల నుండి అంతగా స్పందన కనిపించలేదంటున్నారు. ఇటీవల జరిగిన పలు ఉప ఎన్నికల సందర్భంగా లగడపాటి రాజగోపాల్.. కాంగ్రెసుకు ఒటేస్తే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని, జగన్కు ఓటేస్తే తెలంగాణకు అనుకూలమవుతుందని ప్రచారం చేశారు. కానీ జగన్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారని అంటున్నారు. సీమాంధ్రలో జై ఆంధ్ర, రాయలసీమ ఉద్యమాలు జరుగుతున్నాయని కానీ, తెలంగాణలో సమైక్యాంధ్ర ఉద్యమాలు లేవని అంటున్నారు. సీమాంధ్రుల్లో సమైక్య భావన బలంగా లేదనడానికి ఇవే మంచి నిదర్శనాలు అంటున్నారు.












Click it and Unblock the Notifications