వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు బెయిల్‌పై పార్టీ ఆశలకు మోజులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Y.S. Jagan Mohan Reddy
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వస్తుందనే ఆశలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో మోజులు వేస్తున్నాయి. అక్రమాస్తుల కేసులో ఆయన చాలా కాలంగా హైదరాబాద్‌లోని చంచల్‌గుడా జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవలి పరిణామాలు వారిలో ఆశలు కలిగిస్తు్నాయి.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 వివాదాస్పద జీవోల విషయంలో మంత్రులపై, ఐఎఎస్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. దానికి తోడు, రాష్ట్ర మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలను జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను హైదరాబాదులోని సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టేసింది.

ఈ పరిణామాలు తమ నేత జగన్‌కు బెయిల్ రావడానికి ఉపయోగపడుతాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భావిస్తున్నారు. సిబిఐ తుది చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ స్థితిలో వైయస్ జగన్‌కు బెయిల్ లభించి బయటకు వస్తారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు భావిస్తున్నారు.

వైయస్ జగన్ ఆస్తుల కేసులో మాజీ మంత్రి వెంకటరమణ ఇప్పటికే జైలులో ఉన్నారు. మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి పేర్లను సిబిఐ చార్జిషీట్‌లో నిందితులుగా చేర్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X