బాబుకు ప్రాంతీయ బొప్పి: రాయలసీమ కోణం
అనంతపురం: తెలంగాణ, సీమాంధ్ర మధ్య పోరాటంలో తీవ్ర చిక్కులనే కాకుండా విమర్శలను కూడా ఎదుర్కున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆ సమస్యలు తప్పేట్లు లేవు. ఆనంతపురుం కాంగ్రెసు మాజీ పార్లమెంటు సభ్యుడు అనంత వెంకటరామి రెడ్డి చంద్రబాబుకు ప్రాంతీయ వివక్షను అంటగట్టే ప్రయత్నం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనంత వెంకట్రామి రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును ఆయన మీడియా సమావేశంలో తప్పు పట్టారు. నీటి కష్టాలతో రాయలసీమ అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన చంద్రాబబును విమర్శించారు. చంద్ర బాబు ఒక ప్రాంతానికే సీఎంలా వ్యవహరిస్తున్నారన్నారు.

కండబలం ఉన్న వారే తాగునీరు తీసుకువెళ్తున్నారన్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా?అని ప్రశ్నించారు. రాయలసీమ ప్రయోజనాలను వదిలి నాగార్జునసాగర్, పులిచింతలకు 80 క్యూసెక్కుల నీరు ఎలా ఇస్తారన్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలె చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని అనంత ఎద్దేవా చేశారు.
రాష్ట్ర విభజనకు ముందు చంద్రబాబు సీమాంధ్ర పట్ల ప్రేమను వ్యక్తం చేస్తున్నారని, తెలంగాణను పట్టించుకోవడం లేదని తెలంగాణ నాయకులు దుమ్మెత్తిపోశారు. చివరికి విభజన పూర్తయి రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కూడా చంద్రబాబుకు ఆ తలనొప్పి తప్పడం లేదు. రాయలసీమ నేతలు ఆయనను ఒక ప్రాంతానికి ముఖ్యమంత్రిగా వ్యవహిస్తున్నారని విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి, చంద్రబాబు రాయలసీమకు చెందిన నేత. అందునా చిత్తూరు జిల్లాకు చెందినవారు.
-
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్












Click it and Unblock the Notifications