కొండ పైన లగడపాటి వాగ్వాదం, నడిచి వెళ్లారు
విజయవాడ: మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ గురువారం పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తోంది. దసరా సందర్భంగా కనకదుర్గమ్మను సందర్శించుకోవడానికి లగడపాటి రాజగోపాల్ కుటుంబసమేతంగా ఇందకీలాద్రికి ఉదయం వచ్చారు.
అయితే, ఆయన వాహనాన్ని పోలీసులు కొండ పైకి అనుమతించలేదు. దీంతో, పోలీసులు, దేవస్థానం అధికారులపై లగడపాటి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. వారితో వాగ్వాదానికి దిగారు. పాసులు ఉన్న వాహనాలనే పైకి అనుమతిస్తామని పోలీసులు స్పష్టం చేయడంతో.. లగడపాటి అమ్మ వారిని దర్శించుకోవడానికి నడుచుకుంటూ కొండ పైకి వెళ్లారు.

కాగా, లగడపాటి రాజగోపాల్ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి విజయవాడ నుండి పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమం సమయంలో లగడపాటి సమైక్యవాదం బలంగా వినిపించారు. పార్లమెంటులో బిల్లు సమయంలో పెప్పర్ స్ప్రే చల్లి సంచలనం సృష్టించారు. విభజన జరిగితే రాజకీయాల నుండి వైదొలగుతానని చెప్పిన ఆయన.. ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్












Click it and Unblock the Notifications