కస్టమర్ను గాయపర్చిన బార్బర్కు జైలు శిక్ష
హైదరాబాద్: విధుల పట్ల నిర్లక్ష్యం వహించి తమ వద్దకు వచ్చిన ఓ కస్టమర్ను గాయపర్చిన బార్బర్పై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తి చేసింది. గడ్డం గీయించుకునేందుకు వచ్చిన ఓ కస్టమర్ను తాగిన మైకంలో బార్బర్ బ్లేడ్తో గాయపర్చిన కేసును కోర్టు తీవ్రంగా పరిగణించింది.
కేసును విచారించిన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిందితుడికి ఏడాదిన్నర జైలుశిక్ష విధించింది. కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. మలక్పేట పోలీస్స్టేషన్ పరిధిలోని సలీంనగర్ డివిజన్ బాలదానమ్మ బస్తీకి చెందిన రవీందర్.. సలీంనగర్ ప్రధాన రహదారిలోని ఫుట్పాత్పై క్షౌర వృత్తి నిర్వహిస్తున్నాడు.

2011 ఏప్రిల్ 17న నాచారానికి చెందిన షేక్ హుస్సేన్ గడ్డం గీయించుకునేందుకు అతడి వద్దకు వెళ్లాడు. అనంతరం రవీందర్ రూ. 25 బదులు 50 ఇవ్వాలని డిమాండ్ చేయడంతో హుస్సేన్ నిరాకరించాడు. తాగిన మైకంలో ఉన్న రవీందర్ షేవింగ్ బ్లెడ్తో హుస్సేన్పై దాడి చేశాడు.
దీంతో బాధితుడు మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడ్ని రిమాండ్కు తరలించారు. ఈ మేరకు విచారణ అనంతరం నాంపల్లి క్రిమినల్ కోర్టు నిందితుడికి ఏడాదిన్నర జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications