గిలిగింత: యువీ ఎదుటే అనుష్క నడుంపై కోహ్లీ(ఫోటో)
బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ప్రియురాలు అనుష్క శర్మ కోసం నిబంధనలను పక్కన పెట్టాడు. ఆదివారం ఢిల్లీ - బెంగళూరు మ్యాచ్ను అనుష్క డ్రెస్సింగ్ రూం పక్కనున్న వీఐపీ గ్యాలరీ నుంచి వీక్షించింది.
ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రూంకి వచ్చిన కోహ్లీ.. అనుష్క శర్మను దగ్గరకు రమ్మని సైగ చేశాడు. ఇద్దరు సుమారు ఐదు నిమిషాలు మాట్లాడుకున్నారు. అదే సమయంలో ఢిల్లీ ఆటగాడు యువరాజ్ సింగ్ వారి పక్కనే ఉన్నాడు.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం మ్యాచ్ సమయంలో తోటి ఆటగాళ్లు, మ్యాచ్ అధికారులతో తప్ప మరెవరితోను క్రికెటర్లు మాట్లాడటానికి వీల్లేదు. ఇప్పుడు అనుష్క శర్మను పిలిపించుకొని, మాట్లాడి.. ప్రియురాలి కోసం నిబంధలను అతిక్రమించాడు.
కోహ్లీ, అనుష్క
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్ డెవిల్స్ మ్యాచ్ ఫలితం ఎలావున్నప్పటికీ అందరి కళ్లు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంటపైనే కేంద్రీకృతమయ్యాయ.
కోహ్లీ, అనుష్క
వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడినప్పుడు బాలీవుడ్ నటి, తన గర్ల్ఫ్రెండ్ అనుష్కతో కోహ్లీ కనిపించాడు. వీరిద్దరూ ముచ్చట్లలో మునిగిపోయ కెమేరాకు చిక్కారు.
కోహ్లీ, అనుష్క
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ప్రియురాలు అనుష్క శర్మ కోసం నిబంధనలను పక్కన పెట్టాడు.
కోహ్లీ, అనుష్క
ఆదివారం నాడు ఢిల్లీ - బెంగళూరు మ్యాచ్ను అనుష్క శర్మ డ్రెస్సింగ్ రూం పక్కనున్న వీఐపీ గ్యాలరీ నుంచి వీక్షించింది.