ఊగిసలాట: తోటి ఖైదీలకు రేవంత్ వస్తువులు
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో అరెస్టయి చర్లపల్లి జైలులో ఉన్న తెలుగుదేశం తెలంగాణ పార్టీ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఆశానిరాశల మధ్య ఊగిసలాడారు. బెయిల్ లభించిన ఆనందం ఓ వైపు ఉండగా, సాయంత్రం వరకు జైలు నుంచి బయటకు రావడానికి అవసరమైన లాంఛనాలు పూర్తి కాకపోవడం మరో వైపు నిరాశను కలిగించింది.
గత నెల రోజులుగా రేవంత్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు. ఇంతకాలం అక్కడ తాను వినియోగించిన వస్తువులన్నిటినీ అక్కడి తోటి ఖైదీలకు ఇచ్చేశారు. ఆయనకు బెయిల్ వచ్చిందని తెలిసిన తర్వాత రేవంత్ రెడ్డి వినియోగించిన వస్తువులను తమకు ఇవ్వాలని ఖైదీలు కోరారు.

దాంతో తాను వాడిన దిండ్లు, దుప్పట్లు, దుస్తులు, బూట్లువంటి వాటినన్నింటినీ ఆయన అడిగినవారికి అడిగినట్లు ఇచ్చేశారు. అయితే, మంగళవారం రాత్రి కూడా ఆయన అక్కడే ఉండాల్సి ఉందని తెలిసిన తర్వాత వాటిని తీసుకున్నవారు మళ్లీ తెచ్చిచ్చారని తెలుస్తోంది.
సాయంత్రం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్తారని అందరూ భావించారు. కానీ, అది జరగలేదు. రాత్రంతా ఆయన జైలులోనే ఉండాల్సి వచ్చింది.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
వారం రోజులు ఇక వర్షాలే, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!!












Click it and Unblock the Notifications