‘హనీమూన్’ కొత్త జంటకు షాక్: రూంలోకొచ్చిన చిరుత(వీడియో)
నైనిటాల్: కొత్తగా పెళ్లయిన ఓ జంట హనీమూన్ కోసం నైనీటాల్ వెళ్లింది. అయితే, అక్కడే ఓ హోటల్లో బసచేస్తే కిటికీ నుంచి చొరబడిన చిరుతపులి వారిని హడలగొట్టింది. మొదట చిరుతను చూసి హడలెత్తిపోయిన ఆ జంట.. ఆ తర్వాత మాత్రం సంబరపడిపోయింది.
ఉత్తరాఖండ్లోని నైనీటాల్లోని ఓ హోటల్లో ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సుమిత్, శివానీ అనే కొత్త జంట బస చేసిన నైనీటాల్లోని ఒక హోటల్ గదిలోకి చిరుత ప్రవేశించడంతో అప్పటిదాక సంతోషంగా ఉన్న భార్యాభర్తలు గజగజ వణికిపోయా రు. భయంతో ఏం చేయాలో తెలియకతెలియక భార్యపై దుప్పటి కప్పి భర్త కూడా అందులో దూరాడు.

మెల్లగా దుప్పటి కింది నుంచే దాని కదలికలు గుర్తించాడు. చిరుత బాత్రూమ్లోకి వెళ్లగానే తలుపులు మూసి.. ఒక్క ఉదుటన బయటకు పరుగెత్తి హోటల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. అంతేగాక, చిరుత రూంలోకి వచ్చేందుకు అవకాశం కల్పించడంపై మండిపడ్డారు.
ఆ తర్వాత హోటల్ నిర్వాహకుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి పోలీసులు, అటవీశాఖ అధికారులు చేరుకొని దానిని బోనులో బంధించారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. తమకు ఎలాంటి హానీ కలిగించకోపోవడం, అతి సమీపం నుంచి చిరుతను చూసే అవకాశం కలుగడంపై ఆ నవ దంపతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications