అవార్డ్ వాపసీ: ఇప్పుడు రైతుల వంతు, అందుకే
మంబై: దేశంలో అసహనం ఉందంటూ ఇటీవలి వరకు కొందరు కళాకారులు, రచయితలు తమ అవార్డులు వెనక్కి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, మహారాష్ట్రలో రైతులు తమ అవార్డులను వెనక్కి ఇస్తున్నారు. రైతులు అవార్డులు వెనక్కి ఇస్తోంది.. అసహనం పైన కాదు.
కరువు పీడిత ప్రాంతాల్లో తమను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలసత్వం చూపిస్తోందని, ఈ అలసత్వానికి నిరసనగా తమ అవార్డులను వెనక్కి ఇస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే ఈ అవార్డు వాపసీ ఉద్యమానికి పూనుకున్నామని చెబుతున్నారు.

సాగులో చూపించిన ప్రతిభకు గాను 1983లో రాష్ట్ర ప్రభుత్వం చేత ఉత్తమ రైతు పురస్కారాన్ని అందుకున్న జల్నా ప్రాంతానికి చెందిన నారాయణ ఖడ్కే అనే రైతు ఇటీవల తన అవార్డును వెనక్కి ఇచ్చారు. లాతూర్ జిల్లాలోని కర్ల గ్రామానికి చెందిన మరో రైతు విఠల్ రావ్ కాలే కూడా అవార్డును వెనక్కి ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ రైతు సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టినప్పటికీ అమలులో మాత్రం చిత్తశుద్ధిని చూపించడం లేదని నారాయణ ఖడ్కే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విఠల్ రావ్కు 2001లో అవార్డు వచ్చింది. అతను తన అవార్డుతో పాటు తనకు వచ్చిన రూ.10వేల నగదు బహుమతిని కూడా సీఎం సహాయ నిధికి తిరిగి ఇచ్చేశారు.
-
ఒక్క పోస్టుతో అందరికీ ఇచ్చిపడేసిన "త్రిష".. -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!! -
Snakes and Crocodiles:పాములు,మొసళ్లతో గస్తీ-బీఎస్ఎఫ్ కొత్త ప్లాన్..!! -
ఏమిటీ వింత? తెల్ల పులికి పుట్టిన పసుపు పిల్లలు.. -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
మందు బాబుల పై ధరల బాంబు- మద్యం రేట్లు భారీగా పెంపు, వీటికి మినహాయింపు..!! -
LKG, UKG ఇక సర్కారు బడిలోనే.. 6 వేల కొత్త ఉద్యోగాల! -
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
తెలుగులో నిర్మాతలను పూర్తిగా ముంచేసిన టాప్-5 డిజాస్టర్లు -
ఆ ఉద్యోగులను రెండు నెలల్లో పర్మినెంట్ చెయ్యండి.. హైకోర్టు కీలక ఆదేశాలు!












Click it and Unblock the Notifications