సాక్షి ప్రసారాలపై బ్యాన్: జగన్ పార్టీ మాస్టర్ ప్లాన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాక్షి టీవీ చానెల్ ప్రసారాల నిలిపివేతను తిప్పికొట్టడానికి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇది ఎంత వరకు నిజమో కానీ ఇదే గనుక జరిగితే ఎంఎస్ఓలు భారీగా నష్టపోతారనే ప్రచారం సాగుతోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు, కేబుల్ ఆపరేటర్లకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ షాక్ ఇవ్వడానికి సిద్ధఫడినట్లు ప్రచారం సాగుతోంది. గతంలో ఎన్టీవీ న్యూస్ చానెల్ ప్రసారాలను ప్రభుత్వం అడ్డుకుని దారిలోకి తెచ్చుకుందని అంటున్నారు. సాక్షి విషయంలో అది సాధ్యమయ్యే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు. సాక్షి ప్రసారాలను రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేసింది.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వీరాభిమానులందరితో కేబుల్ ఆపరేటర్లకు సెటప్ బాక్సులను వెనక్కు ఇప్పించేందుకు స్కెచ్ రెడీ చేసినట్లు చెబుతున్నారు. ఒక్కో మండలంలో కనీసం 5వేలమంది స్పందిస్తారని అంచనా వేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25లక్షల కనెక్షన్లుపై వచ్చే ఆదాయాన్ని ఎంఎస్ఓ.లు కోల్పోతారని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఒక్కో కనెక్షన్ కు సగటున 150రూపాయల చొప్పున 37కోట్ల 50లక్షలు ఆపరేటర్లు ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది.
ఇదే సమయంలో డిష్ నెట్ వర్కుల యాజమాన్యాలతో మాట్లాడి డీల్ సెట్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఒకేసారి 25లక్షల కనెక్షన్లు వస్తాయంటే ఏ డిష్ నెట్ వర్క్ అయినా ఎగిరి గంతెయ్యడం ఖాయమని అంటున్నారు. ఇప్పుడు ఈ డీల్ ను దక్కించుకునేందుకు అందరూ పోటీపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఏమైనా చంద్రబాబుపై ఇది టిట్ ఫర్ టాట్లా పనిచేస్తుందని అంటున్నారు.
-
AP Pensions: ఆ పెన్షన్లు తీసేశాం-తేల్చేసిన సర్కార్ ..! -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!!












Click it and Unblock the Notifications