డేరా బాబాకు పద్మ అవార్డు ఇవ్వాలని 4200 మంది ప్రతిపాదన
అత్యాచారం చేసి జైలు పాలైన డేరాబాబా గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్కు పద్మ అవార్డు ఇవ్వాలని కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వశాఖకు పలువురు ప్రతిపాదనలు పంపించడం సంచలనం రేపింది.
న్యూఢిల్లీ: అత్యాచారం చేసి జైలు పాలైన డేరాబాబా గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్కు పద్మ అవార్డు ఇవ్వాలని కోరుతూ కేంద్ర హోంమంత్రిత్వశాఖకు పలువురు ప్రతిపాదనలు పంపించడం సంచలనం రేపింది.
రేపిస్టు అయిన డేరాబాబాను అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారిస్తూ అతనికి ఇరవై ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా ఈ ఏడాది పద్మ అవార్డుల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు 18,768 దరఖాస్తులు రాగా వాటిలో రేపిస్టు గుర్మిత్ పేరును ఎక్కువమంది ప్రతిపాదించడం వివాదాస్పదంగా మారింది.
రేపిస్టు డేరాబాబా పేరు ప్రతిపాదిస్తూ 4,208 దరఖాస్తులు హోంమంత్రిత్వ శాఖకు వచ్చాయి. డేరా సంస్థ కేంద్రమైన సిర్సా పట్టణం నుంచి ఎక్కువమంది గుర్మిత్ పేరును పద్మ అవార్డుకు ప్రతిపాదించారు.
ఇందులో సిర్సా నుంచి అమిత్ అనే వ్యక్తి అయితే ఏకంగా 31 దరఖాస్తులను పంపించాడు. సునీల్ మరో భక్తుడు.. డేరాబాబా పేరిట 27 ప్రతిపాదనలు పంపించాడు. రేపిస్టు అయిన డేరాబాబాకు పౌరులు అభా, ఆదిత్య, అక్బర్, బల్జిందర్, మిల్కీ, కోమల్, జోని, జెస్సీ, ఈశ్వర్ లని సంబోధిస్తూ పద్మ అవార్డుకు నామినేషన్లు పంపారు.
డేరాబాబా పుట్టిన గంగానగర్ నుంచీ దరఖాస్తులు వచ్చాయి. రేపిస్టు పేరును అత్యున్నత పద్మ పురస్కారం కోసం ఎక్కువ మంది పౌరులు ప్రతిపాదించడం చర్చనీయాంశంగా మారింది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications