40ఏళ్ళు దాటిన మహిళలకు అలెర్ట్: మీ ఫిట్నెస్ తో పాటు యవ్వనంగా ఉంచే ఫుడ్స్
ప్రస్తుత సమాజంలో ఇటు ఇంటి బాధ్యతలను మరోవైపు ఉద్యోగ బాధ్యతలను రెంటినీ సమంగా నిర్వహిస్తున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. అయితే వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం పై మాత్రం శ్రద్ధ పెట్టడం లేదు. ముఖ్యంగా నలభై ఏళ్లు దాటిన తర్వాత మహిళలు వారి ఆరోగ్యం పైన ఫిట్నెస్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ఆహారం విషయాల్లో కూడా మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
40 ఏళ్ళు దాటితే ఈ ఆహారాలు బెస్ట్
40సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాలు ఏమిటి? అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం. 40సంవత్సరాలు దాటిన తర్వాత మహిళలలో క్యాల్షియం లోపం పెరుగుతుంది దీనివల్ల ఎముకల బలహీనత వస్తుంది. కాబట్టి ఎముకల ఆరోగ్యం కోసం ఆహారంలో పాలను తీసుకోవడం మంచిది. మహిళలు ప్రతిరోజూ పాలు తాగాలి. వేసవికాలంలో పాలపదార్ధాలు అయిన పెరుగు, మజ్జిగ వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ప్రతిరోజు చీజ్ అలవాటు చేసుకుంటే కూడా మంచిది.

ఆహారంలో డ్రై ఫ్రూట్స్
ఆహారంపై శ్రద్ధ పెట్టని మహిళలలో పౌష్టికాహార లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా 40 ఏళ్ల తర్వాత ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ లోపాన్ని నివారించడం కోసం మహిళలు డ్రైఫ్రూట్స్ ను తినడం గానీ డ్రై ఫ్రూట్స్ తో స్మూతీ చేసుకొని తాగడం కానీ చేయడం మంచిది. ముఖ్యంగా బాదంపప్పు, వాల్ నట్స్ , ఎండు ద్రాక్షలను రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తిన్నా మంచి ప్రయోజనం ఉంటుంది.
సీజనల్ ఫ్రూట్స్
మహిళలు ముఖ్యంగా సీజనల్ ఫ్రూట్స్ తినాలి. వేసవి కాలంలో వచ్చే మామిడి పండ్లు, పుచ్చకాయలు, ఖర్బూజ పండ్లు ఇలా ఏ సీజన్లో వచ్చే పండ్లను ఆ సీజన్లో తప్పనిసరిగా తినాలి. అంతేకాదు మహిళలు ఆకుకూరలు, కూరగాయలను మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ప్రతిరోజు ఒక గిన్నె పప్పును, ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలను కూరగాయలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
సలాడ్స్
ప్రతిరోజు మహిళలు సలాడ్ లు తీసుకుంటే మంచిది. సలాడ్లు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. క్యారెట్, దోసకాయ, బీట్రూట్ మొదలైన వాటిని సలాడ్లుగా తీసుకోవాలి. 40 సంవత్సరాలు దాటిన మహిళలు సరైన ఆహారంతో పాటు తగినంత నీటిని తాగకపోతే శరీరంలో అనేక సమస్యలు వస్తాయి. దీనివల్ల శరీరం ముడతలు పడుతుంది. చర్మం వదులుగా మారడం ప్రారంభమవుతుంది.
ఓట్స్
కాబట్టి తగినంత నీటిని కూడా తీసుకోవడం అవసరం. ఇది మాత్రమే కాకుండా మహిళలు ప్రతిరోజు అల్పాహారంలో ఓట్స్ తీసుకోవడం మంచిది. టీ కి బదులుగా గ్రీన్ టీ లేదా తాజా పండ్ల రసాలను తీసుకోవాలి. ముఖ్యంగా పౌష్టికాహారానికి మహిళలు ప్రాధాన్యతనివ్వాలి. అప్పుడే మహిళలు ఆరోగ్యంగా ఉంటారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications