మండుటెండల్లో తిరిగొచ్చి కూల్ వాటర్ తాగుతున్నారా.. అయితే మీరిది తప్పక తెలుసుకోవాలి
ప్రస్తుతం మనం విపరీతమైన ఎండ పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 40 నుండి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు తీవ్రంగా ఉన్నాయి. ఇక ఈ సమయంలో బయట ఎండలో తిరిగి వచ్చి ఇంటికి రాగానే చల్లని నీళ్ళు తాగుతున్నారా.. అయితే డేంజర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
బాగా ఎండల్లో తిరిగొచ్చికూల్ వాటర్ తాగితే ఏమవుతుందంటే
ఎండలు మండుతున్నాయి అని దాహం తీర్చుకోవటానికి చల్లని నీళ్ళు, ఐస్ వాటర్ తాగే వాళ్ళు ఈ అలవాటును వెంటనే మానుకోవాలని చెప్తున్నారు. తీవ్రమైన ఎండలో తిరిగి వచ్చి చాలా చల్లని నీటిని తాగితే ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. దీనివలన మన చిన్న రక్త నాళాలు పగిలిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

శరీరంలో నీటి నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు నీళ్ళు తాగాలి
విపరీతమైన ఎండల్లో తిరిగి తిరిగి వచ్చి బాగా చెమటలతో శరీరం డీహైడ్రేట్ అయిన తర్వాత ఇంటికి వచ్చి చల్లని నీళ్లను వెంటనే తాగితే చాలా డేంజర్ అని చెబుతున్నారు. శరీరంలో నీరంతా చెమట రూపంలో బయటకు వెళితే దానిని భర్తీ చేసుకోవడానికి నీళ్లను తాగాలి కానీ వెంటనే చల్లటి నీళ్లను తాగకూడదు. అది కూడా ఎండలో తిరిగి తిరిగి వచ్చిన వెంటనే తాగకూడదు.
నీళ్ళు ఎలా తాగాలంటే
ఒకవేళ నీళ్లను తాగిన నార్మల్ వాటర్ అది కూడా నెమ్మదిగా తాగాలి. శరీర ఉష్ణోగ్రత నార్మల్ అవ్వడానికి కాసేపు టైం తీసుకోవాలి. ఆ తర్వాత కాస్త చల్లటి నీళ్లు తాగినా ఇబ్బంది అనిపించదు కానీ ఎండలు మండుతున్నాయని శరీరాన్ని చల్లబరుచుకోవడానికి ఊరికే చల్లటి నీళ్లు తాగడం మంచిది కాదని చెబుతున్నారు వైద్య నిపుణులు.
అలా చేస్తే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం
విపరీతమైన ఎండల్లో తిరిగివచ్చి ఆ ఎండ తీవ్రత ప్రభావం మన శరీరం పైన, మెదడుపైన ఉన్నప్పుడు, వెంటనే చల్లటి నీళ్లను తాగడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి ఎండాకాలంలో ఎండల్లో తిరిగి తిరిగి వచ్చి చల్లటి నీళ్లను తాగే అలవాటు ఉంటే మానుకోండి.
కుండలో నీళ్ళు తాగితే మంచిది
శరీర ఉష్ణోగ్రతను నార్మల్ చేసుకునే కొంత సమయం ఇచ్చిన తర్వాత చల్లని నీళ్లను తాగండి. అసలు చల్లని నీటిని తాగకుండా ఉంటేనే మంచిది. ఫ్రిజ్ లో పెట్టిన నీళ్ళ కంటే కుండలో ఉన్న నీటిని తాగండి. వడదెబ్బ బారిన పడకుండా ఈ జాగ్రత్తలు ప్రతీ ఒక్కరూ తీసుకోవాలి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
'వెయిట్ లాస్ సూప్'.. ఇలా చేసుకుని తాగితే వెయిట్ లాస్ గ్యారంటీ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications