చేపల కూర తిన్నాక వీటిని అస్సలు తినకూడదు భయ్యా
చేపలు లీన్ ప్రొటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్కు మూలం. అవి మొత్తం ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో సహాయపడతాయి. చేపలను ఏ ఆహారాలతో కలిపి తీసుకుంటామనేది చాలా ముఖ్యం. అన్ని ఆహారాలను సీఫుడ్తో కలిపి తీసుకోకూడదు. కొన్నింటితో కలిపి తింటే జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. మరికొన్ని- కడుపు ఉబ్బరం, అజీర్తి, వికారం, డయేరియా వంటి సమస్యలకు దారితీస్తాయి. సీఫుడ్/చేపలతో కలిపి లేదా తిన్న తర్వాత ఏఏ ఆహార పదార్థాలను తీసుకోకూడదో తెలుసుకుందాం.
పాలు, పెరుగు లేదా ఇతర పాల ఉత్పత్తులను చేపలతో కలిపి తినడం వల్ల జీర్ణ అసౌకర్యం, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు చర్మ అలెర్జీలు, ఇన్ఫెక్షన్లు కూడా ఏర్పడవచ్చు. పాల ఉత్పత్తులు, చేపల్లో ఉండే అధిక ప్రొటీన్లు, ఇతర సమ్మేళనాలు జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. చేపలు, నిమ్మజాతి పండ్లు కలిపి తినడం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు నిమ్మలోని ఆమ్లం చేపల ప్రొటీన్తో కలివడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

బాగా ప్రాసెస్ చేసిన లేదా వేయించిన ఆహార పదార్థాలను చేపలతో కలిపి తీసుకోవడం వల్ల కూడా అనారోగ్యానికి దారి తీయవచ్చు. వేయించిన ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్లు గుండె ఆరోగ్యానికి హానికరం. చేపలను బంగాళాదుంపలు, పాస్తా వంటి పిండి పదార్థాలు అధికంగా ఉండే వంటకాలతో కలపడం మానుకోవాలి. ఇలా చేయడం వల్ల అధిక కేలరీలు, కార్బోహైడ్రేట్లు శరీరంలో చేరి జీర్ణ వ్యవస్థ మందగించే అవకాశం ఉంది.
కారంగా ఉండే ఆహారాలు చేపల సున్నితమైన రుచిని డామినేట్ చేయగలవు. అంతేకాకుండా, మసాలా ఆహారాలను చేపలతో కలిపి తిన్నప్పుడు గ్యాస్ట్రోఇంటెస్టినల్ అసౌకర్యం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రావొచ్చు. బీన్స్, పప్పులు, చేపలు రెండూ ప్రొటీన్కు మూలాలే. వీటిని కలిపి తిన్నప్పుడు అజీర్తి, కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. చేపలతో పాటు కాఫీ తాగడం వల్ల చేపల్లో ఉండే పాదరసం (మెర్క్యూరీ) శరీరానికి అందదు అనే వాదన కూడా ఉంది.
పుచ్చకాయ, నారింజ, నిమ్మకాయ వంటి వాటిని సీఫుడ్తో కలిపి తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటివి కలుగుతాయి. చేపలు తిన్న తర్వాత టీ తాగడం కూడా మంచిది కాదు. అలా చేయడం వల్ల టీలో ఉండే టానిక్ యాసిడ్.. జీర్ణవ్యవస్థలో చికాకును కలిగిస్తుంది. సీఫుడ్, రెడ్వైన్ రెండింటిలోనూ హిస్టమైన్ ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల తీవ్రమైన అలెర్జీ, సైడ్ ఎఫెక్ట్స్, శారీరక అసౌకర్యం, తలనొప్పి వంటివి సంభవించవచ్చు.
చేపలకు సహజంగా శీతల స్వభావం ఉన్నందున, పాలకూర, దోసకాయ, పుచ్చకాయ వంటి ఇతర శీతల ప్రభావం ఉన్న ఆహారాలతో దీనిని కలిపి తినకూడదు. ఇది ఉబ్బరం, అజీర్ణానికి దారితీస్తుంది. చేపలతో కలిపి లేదా ఆ తర్వాత చిక్కుళ్ళు తినడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం తలెత్తవచ్చు. అలాగే కోకా కోలా వంటి అధిక ఆమ్ల పదార్థాలను కలిపి తీసుకుంటే అదే విధమైన జీర్ణ సమస్యలు వస్తాయి.
-
"కొత్తిమీర పచ్చిమిర్చి చట్నీ".. అబ్బా ఈ రుచికి తిరుగులేదు..! -
వంకాయ ఎండురొయ్యల కూర.. ఇలా వండండి, అన్నం మెతుకు కూడా వదలరు నమ్మండి! -
ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు:వేసవిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
రేపటి నుంచి గ్యాస్ సిలిండర్లు బంద్, షాకిచ్చిన ప్రభుత్వం -
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!!












Click it and Unblock the Notifications