చావుదెబ్బ కొడుతున్న స్క్రీన్ టైమ్- ఇలా చెక్ పెట్టొచ్చు
రోజువారీ జీవితంలో మొబైల్, కంప్యూటర్/ల్యాప్ టాప్ వినియోగం విస్తృతంగా పెరిగింది. ప్రధాన భాగస్వా మిగా మారిపోయాయవి. వాటి మీద గడపే సమయం రోజురోజుకూ అధికమౌతోంది. రోజులో స్క్రీన్ టైమ్ అనేది మనల్ని మింగేస్తోంది. అలాగే- మనకు తెలియకుండానే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
వాటిని నిలువరించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదనేదు. ఎక్కువ సమయం పాటు మొబైల్, ల్యాప్ టాప్ మీదే గడపడం వల్ల శారీరక శ్రమ సైతం తగ్గుతూ వస్తోంది. స్క్రీన్ టైమ్ పెరగడం వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలను నిలువరించడానికి ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతోన్నారు.

ఆహారపు అలవాట్లే కారణమా?
ఇండియన్ కిచెన్ కు సూపర్ఫుడ్ స్టోర్స్ గా పిలుస్తుంటారు. మనం నిత్యం వంటకాల్లో వినియోగించే పసుపు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వంటి దినుసులతో పాటు ఓట్స్, బార్లీ.. అలాగే తులసి ఆకులు, పుదీన, గ్రీన్ టీ వంటివి క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోక తప్పదని అంటున్నారు.
భారతీయుల్లో పెరుగుతున్న కొవ్వు శాతం
ఇండియన్ కిచెన్ కు సూపర్ఫుడ్ స్టోర్స్ గా పిలుస్తుంటారు. మనం నిత్యం వంటకాల్లో వినియోగించే పసుపు, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వంటి దినుసులతో పాటు ఓట్స్, బార్లీ.. అలాగే తులసి ఆకులు, పుదీన, గ్రీన్ టీ వంటివి క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోక తప్పదని అంటున్నారు.
భారతీయులలో పెరుగుతున్న కొవ్వు
సూపర్ ఫుడ్స్ వంటి ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటోన్నప్పటికీ పాశ్చాత్యుల కంటే భారతీయులే గుండె సంబంధిత ఇబ్బందులకు గురవుతున్నారు. ఓ డయాగ్నస్టిక్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం- 10 మంది భారతీయుల్లో ఆరుమందికి ఎల్డీఎ (LDL- Low densiti Lipoprotein) కొలెస్ట్రాల్ స్థాయి సాధారణం కంటే అధికంగా ఉంటోందని తేలింది.
31 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో ఇది ఎక్కువగా ఉండటం గమనార్హం. పట్టణ ప్రాంతాల్లో 79, గ్రామీణ ప్రాంతాల్లో 72 శాతం మందికి లిపిడ్ అసాధారణ స్థాయిలో ఉందని ICMR-INDIAB అధ్యయనం స్పష్టం చేసింది. ఎయిమ్స్ నిర్వహించిన అధ్యయనంలో గుండెపోటు వచ్చిన యువకుల్లో 70 శాతం మందికి అధిక ఎల్డీఎ ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా, చాలా మందికి తమ కొలెస్ట్రాల్ స్థాయి గురించి ముందుగా తెలియదు.
ఆహారపు అలవాట్లే కారణమా?
సూపర్ఫుడ్స్ మన దేశంలో పుష్కలంగా ఉన్నప్పటికీ, వాటిని ఉపయోగించే విధానంలోనే సమస్య ఉంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది LDL కొలెస్ట్రాల్ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
అల్లిసిన్ చాలా సున్నితమైనది. వెల్లుల్లిని పచ్చిగా దంచి కాసేపు ఆగిన తర్వాత వండితేనే అల్లిసిన్ ఏర్పడుతుంది. మనం నేరుగా వేడి నూనెలో వేయడం వల్ల దానిలోని ఔషధ గుణాలు నశిస్తాయి. పసుపు కూడా అంతే. దీన్ని నల్ల మిరియాలతో కలిపితేనే ప్రయోజనాలు అందుతాయి. మనం దానిని వేయించిన కూరల్లో లేదా తక్కువ మోతాదులో తీసుకుంటుంటాం.
ప్రస్తుతం మన ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారంతో పాటు, ప్రాసెస్ చేసిన స్నాక్స్, చక్కెర పానీయాలు, శుద్ధి చేసిన నూనెలు వాడుతున్నాము. ఒకప్పుడు సంపూర్ణమైన భోజనంగా ఉండే థాలీ స్థానంలో ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సంస్కృతి పెరిగిపోయింది.
ఒకప్పుడు సహజంగా ఉండే ఉపవాసాలు ఇప్పుడు శాస్త్రీయం కాదని కొట్టిపారేస్తున్నారు. దీనికి తోడు శారీరక శ్రమ తగ్గిపోవడం, స్క్రీన్ టైమ్ పెరగడం వంటి కారణాల వల్ల ఆరోగ్యం కోసం మాత్రలు లేదా ప్రోటీన్ బార్లపై ఆధారపడుతున్నారు. ఇంటిలో తయారుచేసిన పప్పు-బియ్యం లేదా మిల్లెట్ కిచిడీ వంటి ఆరోగ్యకరమైన ఆహారానికి దూరమవుతున్నారు.
కొలెస్ట్రాల్పై అవగాహన ముఖ్యం
యువతకు కొలెస్ట్రాల్ గురించి అవగాహన కల్పించాలి. నివారణ పరీక్షలను సాధారణీకరించాలి. ఛాతీ నొప్పి వచ్చే వరకు వేచి చూడకూడదు. మన ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాలు మనకు తెలిసినా వాటిని ఉపయోగించకపోవడమే అసలైన విషాదం అని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications