చర్చించండి, నిజాలు తెలుస్తాయి: కిశోర్ చంద్రదేవ్ లేఖ

ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దిగ్విజయ్సింగ్, పార్టీ కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఏకే ఆంటోనీ, కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్కుమార్ షిండేలకు ఆయన వేర్వేరుగా లేఖలు రాశారు. రాష్ట్ర విభజన జరిగితే తమకు జరిగే నష్టం, వేధింపులను నిరసిస్తూ ఆంధ్రా ప్రాంతంలోని ప్రజలంతా ఉద్యమిస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో లక్ష మందికి పైగా ఏపీఎన్జీవోలు సమావేశమై, భారీ సభ నిర్వహించారని వివరించారు.
స్థానిక ప్రజలతో ఎలాంటి ఘర్షణకు కానీ, ఎలాంటి వాగ్వాదానికి కానీ దిగకుండా, ఎలాంటి సమస్యలూ సృష్టించకుండా చాలా పద్ధతిగా సభ నిర్వహించారని తెలిపారు. ఈ సభలో ప్రసంగాలు కూడా ఉద్యోగులను రెచ్చగొట్టేలా కానీ, అవాస్తవాలను ప్రచారం చేసేలా కానీ లేవని, ఉద్యోగులంతా చాలా గౌరవంగా, వేషభాషల్లో చాలా పద్ధతిగా వ్యవహరించారని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్భాగమైన ఉద్యోగులు నిర్వహించిన ఆ సభ ఆంధ్ర ప్రాంత ప్రజలంతా వ్యక్తం చేస్తున్న మనోభావాలకు దర్పణం పట్టిందని తెలిపారు. ఈ నేపథ్యంలో మారిన పరిణామాలను గుర్తించి, ప్రజల్లో భారీగా మద్దతు కలిగిన ఈ వర్గం నాయకులు, ప్రతినిధులతో చర్చలు జరపాలని సూచించారు. క్షేత్రస్థాయి ప్రజల వాస్తవ మనోభావాలను తెలుసుకునేందుకు, శాంతియుతమైన పరిస్థితుల్ని నెలకొల్పేందుకు ఈ చర్చలు ఉపయోగపడతాయని వెల్లడించారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications