నవరాత్రులు ముగియడం.. ఈ రాశులు కోటీశ్వరులవడం ఖాయం
ఈనెల మూడోతేదీ నుంచి ప్రారంభమైన నవరాత్రులు 12వ తేదీతో ముగుస్తాయి. ప్రతిరోజు ఒక అవతారం, ఒక అమ్మవారిగా దర్శనమిచ్చి భక్తులను కరుణిస్తుంటుంది. దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్న నవరాత్రుల సందర్భంగా కొన్ని రాశులవారికి విపరీతమైన ధనయోగాలు పడుతున్నాయి. అమ్మవారి ఆశీస్సులు, కటాక్షం కలుగుతుందని, సంతాన యోగం ఉందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఏ రాశులవారిని అమ్మవారు నవరాత్రులు ముగిసేలాగా కరుణించి కోటీశ్వరులను చేస్తుందో తెలుసుకుందాం.
వృషభం
ఈ రాశికి శుక్రుడు అధిపతి. ప్రస్తుతం తులారాశిలో సంచారం చేస్తున్న శుక్రుడివల్ల కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి. శుభవార్తలు చెవిన పడతాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం పెరగడం కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ విజయవంతమవుతాయి. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

మిథునం
శనిదేవుడు, శుక్రుడు ఈ రాశివారికి అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల అనేక విజయాలను వీరు సాధిస్తారు. సమాజంలో పలుకుబడి ఎక్కువగా ఉన్నవారితో పరిచయాలు పెరిగి వీరికి కూడా పలుకుబడి పెరుగుతుంది. మనసులో ఎప్పటినుంచో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడానికి కష్టపడతారు. కోరికలన్నీ నెరవేరతాయి.
కన్యారాశి
ధన స్థానంలో శుక్రుడు సంచారం చేస్తున్నారు. ఆదాయం పెరగడంతోపాటు ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఉద్యోగులు పై స్థాయికి చేరుకుంటారు.
తులారాశి
ఈ రాశివారికి మహాభాగ్యం పట్టబోతోంది. ఎందుకంటే శుక్రుడు ఇదేరాశిలో సంచారం చేస్తున్నాడు. అన్నివైపుల నుంచి ఆదాయం పెరగడంతోపాటు ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది.
మకర రాశి
ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తులు కలిసివస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలతోపాటు పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి.
కుంభరాశి
ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఉద్యోగ రీత్యా, వృత్తి రీత్యా విదేశీ ప్రయాణాలున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు విజయవంతమవుతాయి.












Click it and Unblock the Notifications