అట్ల తద్ది: మంచి భర్తని ప్రసాదించే ఆ వ్రతాన్ని ఎలా చేస్తారు?
శరదృతువుకు చెందిన ఆశ్వయుజమాస మధ్యంలో వచ్చే అట్లతద్ది కడవానకారుపబ్బం.
చంద్రోదయ ఉమావ్రతం అట్లతద్ది అనే పేర తెనుగునాట బాగా ప్రచారంలో ఉంది.
ఈ దినాన స్త్రీలు చంద్రుడు ఉదయించిన తరువాత ఉమాదేవిని పూజించి భుజిస్తారు.
ఈ పూజ, ఈ పర్వం తెనుగునాట చిరకాలంగా బాగా ఆచరణలో ఉన్నట్లు కనిపిస్తుంది. అష్టాదశ వర్గాలకు అట్లతద్ది' అని సామెత ఒకటి తెనుగులో ఉండడం ఇందుకు మరోబలం.
అట్ల తద్దికి ముందురోజును అట్లతద్ది భోగి అంటారు.
ఆనాడు ఏం చేస్తారు ?
స్త్రీలందరూ తలంటి పోసుకుంటూరు, వేళ్లకు, కాలి గోళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు.
తెల్లవారకట్లే అనగా తొలి కోడి కూసినప్పుడే లేచి ఉట్టికింద కూర్చుని చద్ది భోజనం చేస్తారు. తాంబూలం వేసుకుంటారు. ఇక అప్పటి నుంచి తెల్లవారే వరకు మరి నిద్రపోరు. కొత్తబట్టలు కట్టుకుని ఆటలతో పాటలతో కాలక్షేపం చేస్తూ వేగిస్తారు. ఊయెలలు ఊగుతారు. ఇక ఆ పగటిపూట భోజనం చేయరు.
భోజనం చేయకపోయినా తాంబూలం మాత్రం సేవించడం కొన్ని కులాల, కొన్ని ప్రాంతాల ఆచారమై ఉంది. రాత్రి వరకు ఉపవాసం ఉండడం వల్ల నోరు ఎండుతూ ఉంటుంది.
అట్లా నోరు ఎండకుండా ఈ తాంబూల సేవనం కాపుదలగా ఉంటుందని చెబుతారు.

తాంబూలం రంగు నోటికి ఎంత ఎర్రగా పండితే వాళ్ళ వాళ్ళ భర్తలు వారిని అంతగా ఆదరిస్తారని నమ్ముతారు. పొద్దుపొడిచాక స్త్రీలు అలంకరించుకొని తోటల, దొడ్లవెంట తిరిగి సాయంకాలము తాము చేయబోయే పూజకు పువ్వులు, పత్రి సంగ్రహించుకుని ఇంటికి తెచ్చుకుంటారు.
ఆ పగలు వీలయినప్పడల్లా ఉయ్యాల ఊగుతారు. ఈ ఉయ్యాలలు ఇళ్లల్లో కాక తోటల్లో దొడ్లల్లో పెద్దచెట్లకు వేసినవిగా ఉంటాయి.
సాయంత్రం ఉమాదేవిని పూజించీచంద్ర బింబము చూచి అట్లని పిండివంటలతో భోజనం చేయిస్తారు.
ఇది అట్లతద్ది నాటి తెలుగుస్త్రీల కార్యకలాపం.
అట్లతద్దిని ఆచరిస్తే ముసలి మొగడు రాడు అని ప్రతీతి.
దీనిని ఒక విధముగా అనవచ్చు, తోటలలో దొడ్లలో విలాసంగా తిరుగుతూ పత్రి సేకరించడం, యధేచ్ఛా విహారంగా ఊయెలలు ఊగుతూ వినోదించడం అంగనలకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి.
నగర స్త్రీల కంటె పల్లెటూళ్లపడతులు ఈ పండుగను ఎక్కువగా, మనోజ్ఞంగా అనుభవిస్తారు.
తెల్లవారగట్ల చద్ది అన్నం గోంగూర పచ్చడి, నువ్వుల గుండ, ఉల్లిపాయ పులుసు మున్నగువానితో తినకపోయినా అట్లతద్ది నోము నోచకపోయినా గోరింటాకు పెట్టుకోకపోయినా, ఉయ్యాల ఊగకపోయినా ముసలిమొగుడు వస్తాడని భయపెట్టి ఈ పనులన్నీ ఆడపిల్లలు అతిశ్రద్దగా చేసేటట్లు తెలుగుగృహిణులు జాగ్రత్తవహిస్తారు.
రాజులు, కాపులు మున్నగు కులాల వారిలో ఈ పండుగ బాగా అమల్లో ఉన్నట్లు కనిపిస్తుంది.
కొత్తగా పెళ్లి అయిన పడుచులకు ఈపండుగకు తగవులు కావిళ్లతో పంపుతారు. క్రొత్తడికి పసుపు, కుంకుమలు, చీర, రవికెల గుడ్డ ఒక సువర్ణాభరణం ఆమె పేరంటాళ్లకు పెట్టుకొనేందుకు అరటిపళ్లు, కూరలు మున్నగు సంబారాలు విరివిగా పంపుతారు.
తెల్లవారగట్ల ముతెదువలతో కలిసి భోజనం. పగలు భోజనం చేయకుండా ఉండాలి. చంద్రోదయమైన పిమ్మట పూజ చేసి ముత్తైదువులకు సరస పదార్థ సంపన్నమైన అన్నం పెట్టి తాను భోజనం చేయాలి.
ఇది 'చంద్రోదయోమా వ్రతం' చంద్రుడు ఉదయించిన తరువాత గౌరిని కొలిచే వ్రతం.
అయినా కోమటి బ్రాహ్మణుల ఇళ్లలో గౌరీపూజ అట్లతద్ది నాటి మధ్యాహ్నమే జరిపించడం ఆచారంగా ఉంది. అట్లనైవేద్యం పెట్టి మధ్యాహ్నమే భోజనం చేసివేస్తారు.
మిగతా కులాల్లో ఆచారం ఇందుకు భిన్నంగానూ, శాస్త్రీయంగానూ ఉంది. ఆ కులాల్లోని వారుసాయంత్రం గౌరీ పూజను నీలాటిరేవున చేస్తారు. చంద్రదర్శనం అయ్యాక భోజనం చేస్తారు.
అట్లతద్దెనోము నోచుకుంటే కన్యలకు ముసలి మగడురాడు. పెళ్లి ఐన వాళ్లకు నిండు ఐదవతనం కలుగుతుంది.
అట్లతద్దికి గోదావరినీళు అట్లలాగ విరిగిపోతాయి.
బడిబడినట్లతద్దె యను పండుగ వచ్చిన సంతసిల్లుచున్
వడిందెలవారు చుక్కబొడువం గని లేచి సమస్త బాలికల్
మడినిడి పాట్లకాయ పరమానము నన్నము మెక్కియాటలన్
బడివునాcటనుయ్యెలలపైదగనూగుట జాడనొప్పదే -
అనేది ఒక పద్యం "తెలుగునాడు" దాసు శ్రీరాములు రాశారు.
అట్లతద్ది నాడు గోరింటాకు
ఏడాదిలో తెలుగు స్త్రీలు గోరింటాకు తప్పకుండా పెట్టుకొనే మూడుపండుగలలో అట్లతద్ది ఆఖరుది.
నఖరంజని
ఆషాఢమాసంలో ఒకసారి, భాద్రపదమాస మధ్యంలోని
ఉండ్రాళ్లతద్దికి ఒకసారి, ఆశ్వయుజమాస మధ్యంలోని అట్లతద్దికి ఒకసారి మొత్తం ఏడాదిలో మూడు సారులు తెనుగు తెరవలు గోరింటాకు పెట్టుకుంటారు.
ఆ పెట్టుకోవడంలో చేతివేళ్లకు, గోళ్లకు అరచేతులకు, పాదాలకు, అరిపాదాలకు, కాలిగోళకు సుదుటివూద బొట్టుపెట్టుకునేచోట పెట్టుకుంటారు.
ఇన్ని చోట్లపెట్టుకొనేది అయినా గోళ్లకు అలంకారమునకు ఆరూఢమైంది." గోళ్లకు పెట్టుకునేది అనే నామమేసంస్కృతంలో నఖరంజని అనే పేరు ఉంది.
నఖరంజని అనగా గోళ్లకు రంగు కలిపించేది అని అర్థం. తెనుగు పేరైన గోరింటకు
కూడా ఇదే అర్ధమని బ్రౌనుదొర సూచిస్తున్నాడు. గోరింట గోరింట గోరు+అంటు' అని.
గోరింట విషయంలో కొన్ని విధి నిషేధాలు ఉన్నాయి. దీనని బాలికలు, ముత్తయిదువులు మాత్రమే పెటుకుంటారు. మగవాళు పెట్టుకోరు. చిన్నారి మగపిల్లలు పెట్టుకుంటారు.
గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆడవాళ్లకే పరిమితమైనదని తేలుతూ ఉంది.
ఆడవాళు గోరింటాకు పెట్టుకోవడం ఆరోగ్యదృష్ట్యా
వాళ్ళు పనిపాటలు చేయడంలో తరచు నీళు వాడుతూ. చెమ్మలో, ఎండలో తిరుగుతూ ఉండాలి. పేడ, మనవి బూడిద మున్నగునవి ముట్టుకుంటూ ఉండాలి. ఈ చర్యల వల్ల వాళ్ల మన్నూ మశానమూ, రోగకారక క్రిములు చేరడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలి వేళ్లసందున ఎల్లిపోవడం కూడా ఉంటుంది.
గోరింటాకు పెట్టుకోవడంవల్ల గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. వాటిని అంటిపెట్టకుండే విషక్రిములు నశిస్తాయి. అవీ పిప్పి గోళ్లు కాకుండా క్రాఫ్టుదలగా ఉంటుంది. గోరింట పెట్టుకున్నవాళ్ల వ్రేళ్లసందున ఎంసిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది.
గ్రీష్మ ఋతువుకు చెందిన ఆషాఢమాసము వర్షఋతువుకు స్వాగతం చేసేమాసం. వర్ష ఋతువుకి చెందిన భాద్రపదమాసంలో ఉండ్రాళ్లతద్ది నడివర్షాకాలపు పండుగ. శరదృతువుకు చెందిన ఆశ్వయుజమాస మధ్యంలో వచ్చే అట్లతద్ది కడవానకారుపబ్బం. ఈ మూడు పర్వసందర్భాలలో గోరింటాకు పెట్టుకుని తమ గోళ్ల ఆరోగ్యం, అందం కాపాడుకునే ఆచారం ఇట్లు పండుగల కార్యవిధానంలో మన పెద్దలు
మేళవింపునొందించారు.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ












Click it and Unblock the Notifications