Astrology: ఒకే రోజు మహా శివరాత్రి, శని త్రయోదశి.. ఎవరిని మొదట పూజించాలి..!
ఈ సంవత్సరం మహా శివరాత్రి, శని త్రయోదసి ఒకే రోజు వచ్చాయి.
మహా శివరాత్రి పండుగ జరుపుకునేందుకు భక్తులు సిద్ధమైయ్యారు. తెలుగు రాష్ట్రల్లోని శివాలయాలు మహా శివరాత్రి వేడుకలకు సిద్ధమయ్యాయి. అయితే ఈసారి మహాశివరాత్రితోపాటు, శనిత్రయోదశి ఒకే రోజు వస్తున్నాయి. ఇలా రావడం మంచిదేనా.. జ్యోతిష్యులు ఏం చెబుతున్నారో తెలుసుకుందా.. దాదాపు 114 సంవత్సరాల తర్వాత శివరాత్రి, శనిత్రయోదశి ఒకే రోజు వస్తున్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు.

ముందుగా శని దేవుడు
భక్తులు ముందుగా శని దేవుడిని పూజించి.. తర్వాత శివుడి పూజ చేయాలని చెబుతున్నారు. సాధారణంగా జాతకంలో శని దోషం ఉన్నవాళ్లు, ఏలిన్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దశలు నడుస్తున్నవాళ్లు.. ప్రతి శనివారం శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి, నల్ల వస్త్రాలు, నల్ల నువ్వులు దానం చేయడంతో పాటు కాకికి నల్ల బెల్లం పెడతారు. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతన్నారు. శని త్రయోదశి నాడు ఇలా చేస్తే మరింత ఫలితం వస్తుందని నమ్ముతుంటారు.

బిల్వ వృక్షం
పురాణాల ప్రకారం శని కరుణిస్తే అసలు కష్టాలు ఉండవట.శనికి కోపం వాస్తే ఈశ్వరుడి కైనా సరే శని దోషం తప్పదని.శని యముడికి సోదరుడు, జ్యేష్టాదేవికి భర్త, శివుడికి పరమ భక్తుడు. అతని భక్తిని శివుడు పరీక్షించాలనుకున్నాడు. నేనంటే నీకు ప్రీతి కదా, నేను ఏ రూపంలో ఉన్న సరే నన్ను గుర్తుపట్టగలవా అని పరమశివుడు శనికి ఒక షరతును విధిస్తాడు. శనిని పరీక్షించేందుకు శివుడు సూర్యోదయం సమయంలో బిల్వ వృక్షంగా మారుతాడు.

ఈశ్వరుడు
సాయంత్రానికి మళ్లీ మామూలు రూపంలో ప్రత్యక్షమవుతాడు. బిల్వ వృక్షం నుంచి అసలు రూపంలోకి వచ్చిన శివుడికి శని కనిపిస్తాడు.శనీశ్వర నన్ను పట్టుకోలేకపోయావుగా అని ఈశ్వరుడు చెప్పినప్పుడు అదేంటి స్వామి నేను పట్టుకోవడం వల్లే కదా మీరు బిల్వ వృక్షం రూపం దాల్చాల్సి వచ్చింది అని జవాబు చెబుతాడు.ఇలా ఈశ్వరుడు శని భక్తిని మెచ్చుకున్నాడు. బిల్వ దళాలతో శనీశ్వరుని పూజిస్తే శుభాలను అనుగ్రహిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే బిల్వ దళాలతో శనీశ్వరుడిని పూజిస్తారు.

విద్యుత్ దీపాలు
అందుకే వచ్చే శివ రాత్రికి మొదట శని దేవుడిని దర్శించుకుని తర్వాత శివుడి దర్శనం చేసుకోవాలని సూచిస్తున్నారు. కాగా మహా శివరాత్రికి వేములవాడ రాజన్న ఆలయం ముస్తాబైంది. ఆలయ అధికారులు ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇటు శ్రీశైలంలో కూడా మహా శివరాత్రికి ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచి శివాలయాల్లో రద్దీ ఉండే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications