రెండేళ్లపాటు ఈ రాశులను డబ్బులో ముంచెత్తనున్న శనిదేవుడు
నవగ్రహాల్లో శనిదేవుడు న్యాయదేవత. కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. ఆయన అనుగ్రహం ఉంటే బిచ్చగాడు కూడా కోటీశ్వరుడవుతాడు. ఆగ్రహిస్తే కోటీశ్వరుడు కూడా బిచ్చగాడు అవుతాడు. వచ్చే ఏడాది శని కక్ష్యను మార్చుకుంటున్నాడు. శనిదేవుడికి నాలుగు పాదాలుంటాయి. బంగారం, వెండి, ఇనుము, రాగి. వచ్చే ఏడాది బృహస్పతి మీనరాశిలో సంచారం చేయనున్నాడు.
ఆయన 2027 వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల కొన్ని రాశులవారి జన్మ నక్షత్రంలో వెండిని ఆధారం చేసుకొని కలయిక ఉంటుంది. ఏయే రాశులవారికి ఈ కలయిక వల్ల మేలు కలుగుతుందనే విషయాన్ని తెలుసుకుందాం. వారిని శనిదేవుడు ఏవిధంగా కోటీశ్వరులను చేయబోతున్నారో కూడా తెలుసుకుందాం.

కర్కాటకం
ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతోపాటు పదోన్నతి ఉంటుంది. కొందరికి ఆకస్మిక ధనయోగం ఉంది. అలాంటి ఇలాంటి యోగంకాదు. భారీగా ఉంటుంది. డబ్బుకు సంబంధినంచిన సమస్యలన్నీ పరిష్కరింపచేసుకుంటారు. పనుల్లో ఏర్పడుతున్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లడానికి ప్రణాళికలు రచించుకుంటారు. ఈ విషయంలో విజయవంతమవుతారు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించాలి.
వృశ్చికం
సంపద పెరిగి కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు మంచి ఆదాయం వస్తుంది. భూమిని లేదంటే భవనాన్ని లేదంటే వాహనాన్ని కొనుగోలుచేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఎంత కష్టపడితే డబ్బు పరంగా అంత ప్రతిఫలాన్ని పొందుతారు. ఎదుటివారితో మాట్లాడే విషయంలో మాట ఎంతో సున్నితంగా ఉండాలి. దీనివల్ల కొన్ని పనులను మీరు సాధించగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది.
కుంభం
ఉద్యోగస్తులకు వారి కార్యాలయాల్లో సీనియర్ల నుంచి సంపూర్ణమైన మద్దతు లభించి మంచి పేరు సంపాదించుకుంటారు. సంతోషకరమైన వార్తలను వింటారు. జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ లేని ఆనందంతో ఉంటారు. గతంలో మొదలై నిలచిపోయిన పనులను ప్రారంభించి విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వరిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. లేదంటే విహార యాత్రలకు వెళతారు.












Click it and Unblock the Notifications