Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ugadi panchangam 2023: తులారాశి నుండి మీనరాశి వరకు ఆదాయ వ్యయాలిలా.. శుభఫలితాలకు పరిహారాలివే!!

తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ నుండి గ్రహాల సంచారం మార్పుతో రాశుల ఫలితాలలోను మార్పులు చోటు చేసుకుంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక 2023 శోభకృత్ నామ ఉగాది సంవత్సరం రానే వచ్చింది. దీంతో తమ జాతకం ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు.

రాశి ఫలాలలో అశుభ ఫలితాలకు పరిహారాలు
కొందరు తమ జాతకంలో అశుభ ఫలితాలు ఉన్నాయి అని తెలుసుకొని ఆందోళన చెందుతున్నారు. అయితే అశుభ ఫలితాలు ఉన్నంత మాత్రాన ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వాటికి మంచి పరిహారాలు కూడా ఉన్నాయని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ప్రస్తుతం మనం తులారాశి నుండి మీన రాశి వరకు ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయి. అలాగే వారు చేయవలసిన పరిహారాలు ఏమిటి వంటి వివరాలను తెలుసుకుందాం.

 తులారాశి

తులారాశి

తులా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14 గా, వ్యయం 11 గా ఉంటుంది. రాజపూజ్యం 7, అవమానం 7గా ఉంటుంది. ఈ సంవత్సరం తులారాశి వారికి శుభ ఫలితాలు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరింత మెరుగైన ఫలితాల కోసం తులారాశి జాతకులు సంకటహర గణపతి ఆరాధన చేయడం, గణపతికి ఉండ్రాళ్ళను నివేదించడం మంచిదని సూచిస్తున్నారు.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం 5 గాను, వ్యయం 5 గాను ఉంటుంది. రాజపూజ్యం 3, అవమానం 3గా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అశుభ ఫలితాలు వస్తాయని చెప్పబడింది. వృశ్చిక రాశి జాతకులు మెరుగైన ఫలితాల కోసం, పని వాళ్లకు సహాయం చేయాలని, తీపి గుమ్మడికాయను దానం చేయాలని, శనికి తైలాభిషేకం చేసి, శివాలయ దర్శనం చేయాలని సూచించబడింది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం 8 గాను, వ్యయం 11 గాను ఉంటుంది. రాజపూజ్యం 6 అయితే, అవమానం మూడుగా ఉంటుంది. ధనస్సు రాశి జాతకులకు ఈ సంవత్సరం శుభంగా ఉంటుంది. వీరు మరుగైన ఫలితాల కోసం ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయడం మంచిదని సూచించబడింది.

మకర రాశి

మకర రాశి

మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం 11 గాను, వ్యయం 5 గాను ఉంది. రాజపూజ్యం 2, అవమానం 6గా ఉంది. మకర రాశి వారికి ఈ సంవత్సరం సాధారణంగా ఉంటుంది. అయితే మకర రాశి జాతకులు మెరుగైన ఫలితాల కోసం నవగ్రహ జపం చేయడం, శనికి తైలాభిషేకం చేయడం, దేవాలయాలను దర్శించడం వంటి పరిహారాలను సూచించారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

కుంభరాశి

కుంభరాశి

కుంభ రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5గా ఉంటుంది. రాజపూజ్యం 5, అవమానం 6గా ఉంటుంది. కుంభరాశి జాతకులకు ఈ సంవత్సరం అశుభ ఫలితాలు వస్తాయని సూచించబడింది. శనికి తైలాభిషేకం, శివుడికి రుద్రాభిషేకం చేయడం మంచిదని సలహా ఇవ్వబడింది. శనివారం నియమం పాటించడం తోపాటు, శనివారం నాడు ఎక్కువగా నడక సాగించవలసిన అవసరం ఉందని చెప్పబడింది.

మీనరాశి

మీనరాశి

మీన రాశి జాతకులకు ఈ సంవత్సరం ఆదాయం 8 గాను, వ్యయం 11 గాను ఉంది. రాజపూజ్యం 1, అవమానం రెండుగా ఉంది. మీనరాశి జాతకులకు ఈ సంవత్సరం శుభంగా కనిపిస్తుంది. మీనరాశి జాతకులు ఇంకా మెరుగైన ఫలితాల కోసం శని గ్రహ జపం చేయాలని, శనికి తైలాభిషేకం చేయాలని, ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది.


disclaimer: ఈ కథనం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల సలహాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+