Vastu Tips: మీ ఇంట్లో పగిలిన, విరిగిన వస్తువులున్నాయా.. అయితే అరిష్టమే..!
చాలా మందికి అన్ని ఉన్నా ప్రశాంతత కరవుతుంది. ఈ మానసిక ప్రశాంతత ఇంటి వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ఇంట్లో నిత్యం చికాకులు, గొడవలు, పగలు ఉంటే జీవితంలో ఇబ్బందులు తప్పవు. అందుకే ఇంట్లో, మానసిక ప్రశాంతత కోసం వాస్తు శాస్త్రంలో ఉన్న ప్రకారం నడుచుకుంటే మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది విరిగిన, పగిలిన వస్తువులను ఇంట్లో ఉంచుకుంటారు. ముఖ్యంగా కొందరు అద్దం పగిలినా దాన్నే వాడుతుంటారు. ఇది మంచికాదని నిపుణులు చెబుతున్నారు. విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచవద్దని సూచిస్తున్నారు. గ్లాస్ లేదా కిటికీ లేదా ఫర్నీచర్ ఏదైనా... పగిలిన వస్తువులను వీలైనంత త్వరగా ఇంట్లోంచి బయట పడేయాలని చెబుతున్నారు. విరిగిన వస్తువులు సానుకూల శక్తి ప్రవాహాన్ని నిరోధిస్తాయని వారు వివరిస్తున్నారు.

వాస్తు ప్రకారం మనం ఇంట్లో చేసే చిన్న చిన్న తప్పులే ఇంటి ప్రశాంతతను పాడు చేస్తాయి. అందుకే వాస్తు ప్రకారం ఏ చోట ఏ వస్తువులు పెట్టాలో తెలుసుకోవాలి. ఇంటికి ఈశాన్య దిశలో ఎరుపు రంగు వస్తువులను ఉంచకోవద్దని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈశాన్యంలో ఎరుపు రంగు వస్తువులు ఉండడం వల్ల ప్రశాంతత కరవుతుందట. చెత్త డబ్బాలు, పాత వార్తాపత్రికలను కూడా ఈశాన్య దిశలో పెట్టొద్దట.

ఇంట్లో సానుకూలతను పెంచుకోవడానికి, ఈశాన్యంలో ఓంకారం లేదా స్వస్తిక్ గొడపై ముద్రించుకోవాలి. ఇలా చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుందట. ఇంట్లో పడకగది పశ్చిమ-వాయువ్య దిశలో ఉండకూడదట. ఈ దిశలో ఎక్కువ సేపు ఉండడం వల్ల మీకు అశాంతి కలిగే ఛాన్స్ ఉందట. ఇంటి తూర్పు దిశలో ఎక్కువ మొక్కలు ఉంచడం మానసిక ఆరోగ్యానికి మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఈ సమాచారం కేవలం వాస్తు నిపుణుల అభిప్రాయాల ప్రకారం ఇచ్చాం. దీనిని వన్ ఇండియా ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications