ఇంటికి వాస్తు దోషాలుంటే రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేయండి
ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం జరిగినా ఎక్కడో ఒకచోట పొరపాటు కలుగుతుంది. తర్వాత సమస్యలు ఎదురవుతుంటే వాస్తు దోషాలున్నాయని కొంతమంది గోడలు, తలుపులు కూడా పగలగొట్టిస్తారు. మరోచోటకు మారుస్తారు. ఖర్చు ఎక్కువ. తర్వాత ఏమైనా ఫలితం దక్కుతుందా? అదీ దక్కదు. అందుకే వాస్తు దోషాలున్నాయని తేలినప్పుడు ఎటువంటి గోడలు పగలగొట్టే పనిలేకుండా చిన్న చిన్న నివారణలు పాటిస్తే చాలు.. శాంతి, శ్రేయస్సు దక్కుతాయి. వాటిగురించి తెలుసుకుందాం.
ఇంటి మెయిన్ తలుపుపై పసుపు లేదా ఎరుపు రంగుల్లో స్వస్తిక్ చిహ్నం గీయాలి.
ద్వారం వద్ద దీప స్తంభం వెలిగించాలి.
దీనివల్ల కుటుంబంలో శాంతి నెలకొంటుంది.
ప్రతికూల శక్తులన్నీ దూరమవుతాయి.

ప్రతి రోజు సాయంత్రం రెండు లవంగాలతో కర్పూరం వెలిగించాలి.
ఇలా చేయడంవల్ల ఇంట్లో గాలి శుభ్రం అవుతుంది.
ప్రతికూల శక్తులన్నీ పారిపోతాయి.
కర్పూరం కాలేటప్పుడు వచ్చే వాసన మానసికంగా ప్రశాంతతను కలిగిస్తుంది.
దీనివల్ల మానసికంగా స్థిరత్వం కలుగుతుంది.
ఒక గాజు పాత్రలో ఉప్పు నీటిని ఉంచి ఉత్తర దిశలో పెట్టాలి.
దీనివల్ల వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి.
ప్రతి 3 రోజులకు ఒకసారి ఆ నీటిని మారుస్తుండాలి.
ఉప్పు ప్రతికూల శక్తులను ఆవాహన చేసుకుంటుంది.
ఇంట్లో పాడైన వస్తువులుంటే పారేయండి.
ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచండి.
వంటగది, పడకగది చాలా శుభ్రంగా ఉండాలి.
ఆగిపోయిన వాచీలు, పగిలిపోయిన అద్దాలు,
ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయనివి వెంటనే తొలగించాలి.
ప్రతి ఉదయం కిటికీలు తెరిగి సహజంగా వచ్చే గాలి, వెలుతురును రానివ్వాలి.
దీనివల్ల సానుకూల శక్తి పెరుగుతుంది.
ఇటువంటి చిన్న చిన్న మార్పులే వాస్తు దోషాలను పూర్తిగా తొలగిస్తాయి.












Click it and Unblock the Notifications