రావి, మర్రి చెట్లు ఎందుకు పవిత్రం?
రావి, మర్రి వృక్షాలు ఎందుకు పవిత్రతను ఆపాదించుకున్నాయి, దాని వెనక గల కథేమిటనే విషయాన్ని జ్యోతిష్కుడు విడమరిచి చెప్పారు.
సూతుడు చెప్పినది విని - ఇతర వృక్షములన్నిటి కంటే కూడా రావి, మర్రి మాత్రమే గో బ్రాహ్మణ తుల్య పవిత్రతని ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు. పూర్వమొకసారి పార్వతీ-పరమేశ్వరులు మహాసురత భోగంలో వుండగా - కార్యాంతరం వలన దేవతలు, అగ్నీ - కలిసి బ్రాహ్మణ వేషధారులై వెళ్లి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు.
అందుకు కినిసిన పార్వతీ దేవి సృష్టిలోని క్రిమికీటకాదులు సహితము సురతములోనే సుఖపడుతూ వున్నాయి. అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు. నాకు సురత సుఖభ్రంశాన్ని పాటించిన మీరు చెట్లయి పడి వుండండి" అని శపించింది.

తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణామంలో బ్రహ్మ పాలాశవృక్షంగానూ, విష్ణువు అశ్వత్తంగానూ, శివుడు వటముగానూ మారారు. బ్రహ్మకు పూజార్హత లేదు. జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు గనుకనే రావి, మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత చెప్పడాన్ని ఆపాడు సూతుడు.












Click it and Unblock the Notifications