వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలికల కిడ్నాప్‌ కథ సుఖాంతం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః హైదరాబాద్‌ లో సంపన్నులు నివశించే జూబ్లీ హిల్స్‌ లో మంగళవారం కిడ్నాప్‌ నకుగురైన ఇద్దరు బాలికలు బుధవారం క్షేమంగా ఇల్లు చేరారు. దీనితో నగరంలో సంచలనం సృష్టించిన ఈ కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్లను మెదక్‌ జిల్లాలో పోలీసులుఅరెస్టు చేశారు. బాలికలను ఇల్లు చేర్చారు. కిడ్నాపర్లకు మాఫియా ముఠాలతో సంబంధాలు వున్నట్లు అనుమానం వుండడంతో వారిని ముంబయ్‌ తీసుకువెళ్ళినట్లు పోలీసులు చెప్పారు.

మంగళవారం ఉదయం ప్రముఖ వ్యాపార వేత్త కుమార్తెలు సుగుణ, సుమేదాలు పాఠశాలకు వెళుతుండగా నెంబర్‌ లేని తెల్ల మారుతీ కారు ఒకటి వచ్చి వారి పక్కన ఆగింది. వెంటనే దుండగులు ఆ ఇద్దరువిద్యార్థినులను బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళారు. ఈ సంఘటన రాజధాని నగరంలో సంచలనం సృష్టించింది.

నిందితుల ఆచూకీ చెప్పిన వారికి లక్ష రూపాయల బహుమానం ఇస్తామని రాష్ట్ర హోం శాఖ మంత్రి దేవేందర్‌ గౌడ్‌ ప్రకటించారు. మంగళవారం సాయంత్రం కిడ్నాపర్లు ఐ.టి.సి. డిస్ట్రిబ్యూటర్‌ గోపాలకృష్ణకు ఫోన్‌ చేసిమీ కుమార్తెలను విడిచి పెట్టాలంటే ఐదు కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు. సుమారు రెండు గంటల పాటు కిడ్నాపర్లతో బేరసారాలు జరిగాయి.

అయితే మంగళవారం రాత్రి వీరు ప్రయాణిస్తున్న కారు మెదక్‌ జిల్లాలో ఒక చోట ఆగిపోయింది. దీనితో కిడ్నాపర్లను పోలీసులుఅరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X