దేవీలాల్ కన్నుమూత Home Full Story
న్యూఢిల్లీ: మాజీ ఉప ప్రధాని దేవీలాల్ శుక్రవారం సాయంత్రం ఇక్కడి అపోలో ఆస్పత్రిలో గుండెపోటుతో కన్నుమూశారు.ఆయన వయస్సు 86 ఏళ్లు. ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు- హర్యానా ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా, రంజిత్ సింగ్, ప్రతాప్ సింగ్. దేవీలాల్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, సీనియర్ పార్లమెంటేరియన్దేdలాల్ అంత్యక్రియలు శనివారం సాయంత్రం నాలుగు గంటలు కిసాన్ ఘాట్లో జరుగుతాయని ఓం ప్రకాశ్ చౌతాలా చెప్పారు.
దేవీలాల్ శుక్రవారం రాత్రి ఏడు గంటలకు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దేవీలాల్ విపి సింగ్, చంద్రశేఖర్ మంత్రివర్గాల్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. దేశ రాజకీయాల్లో కురువృద్ధడయిన దేవీలాల్ 1914 సెప్టెంబబర్ 25వ తేదీన హర్యానాలోని చౌతాలలో జన్మించారు. దేdలాల్ మరణ వార్త తెలిసిన వెంటనే హర్యానా ముఖ్యమంత్రి చౌతాలా తన అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హుటాహుటిన అక్కడికి వెళ్లిపోయారు. కేంద్ర రసాయనాల, ఎరువుల మంత్రి సుఖ్దేవ్ సింగ్ థిండ్సా, ఉపరితల రవాణా మంత్రి శరద్ యాదవ్ దేdలాల్ భౌతిక కాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.