ప్రైవేట్కు బ్యాలెట్ పత్రాల ముద్రణ
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల బ్యాలెట్ పత్రాలముద్రణను ప్రయివేట్ సంస్థలకు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘంనిర్ణయించింది. బ్యాలెట్ పత్రాల ముద్రణజులై 4వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కాకిమాధవరావు గురువారం చెప్పారు. ఎన్నికలఏర్పాట్లపై ఆయన ఇక్కడ జిల్లా కలెక్టర్లతో సమావేశం ఏర్పాటుచేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం ప్రభుత్వంనిధులు విడుదల చేయకపోతే జిల్లా పరిషత్లనుంచి తీసుకోవాలని ఆయన కలెక్టర్లకుసూచించారు.
ఎన్నికల నిర్వహణ కోసంకట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుచేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి 30 కంపెనీల పారామిలటరీ బలగాలను రప్పిస్తున్నట్లు, ఎన్సిసివిద్యార్థులను ఉపయోగించుకోనుననట్లుమాధవరావు చెప్పారు. ఆదిలాబాద్, శ్రీకాకుళం,విజయనగరం, తదితర జిల్లాల్లో ఎన్నికలసిబ్బంది కొరత ఏర్పడే పరిస్థితి వున్నదని, ఇతర విధాలుగావారిని నియమించుకోవచ్చునని కలెక్టర్లకు చెప్పాననిఆయన అన్నారు.