వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సత్యం-ఎపిసెంట్రిక్ వ్యూహాత్మక ఒప్పందం
హైదరాబాద్: పోర్టల్ సొల్యూషన్లను అందించే అమెరికా కంపెనీ ఎపిసెంట్రిక్తో రాష్ట్రానికి చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సత్యం కంప్యూటర్స్ వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నది.
ఈ ఒప్పందం ప్రకారం ఎపిసెంట్రిక్ పౌండేషన్ సర్వర్ ద్వారా ఎపిసెంట్రిక్ కస్టమర్లకు స్ట్రాటజిక్ కన్సల్టింగ్, ఇంటిగ్రేషన్ సర్వీసులను సత్యం అందజేస్తుంది. దీనివల్ల ఫార్చూన్-500 కంపెనీలు సత్యం కంప్యూటర్స్ ద్వార ఎండ్ టు ఎండ్ కన్సల్టెషన్, ఎపిసెంట్రిక్ ఇంటిగ్రేటెడ్ వెబ్ సర్వీసులను పొందగలుగుతాయి.
Story first published: Thursday, June 28, 2001, 23:53 [IST]