వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాశ్మీర్పై భారత్వైఖరి మారలేదు
న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్విషయంలో భారతదేశ వైఖరిలో ఏ విధమైనమార్పుల లేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. కాశ్మీర్ భారత్లో అంతర్భాగమనేవైఖరిని సడలించబోమని, నీరు గార్చబోమనివిదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నిరుపమారావు గురువారంవిలేకరులతో చెప్పారు.
పాకిస్థాన్, భారత్ల మధ్య సంబంధాలనుమెరుగుపరుచు కోవడానికి మాత్రమే ముషర్రాఫ్,వాజ్పేయిల మధ్య శిఖరాగ్ర సమావేశంజరుగుతోందని ఆమె అన్నారు. పాకిస్థాన్తో చర్చించేదేమీలేదని గతంలో చెప్పి, పాక్ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ ప్రాంతంతో పాటు మొత్తం కాశ్మీర్అంతా భారత్లో అంతర్భాగమని 1994లోపార్లమెంటులో తీర్మానం చేసి ఇప్పుడు ముషర్రాఫ్తోచర్చలు జరపాలనుకోవడం వైఖరిని మార్చుకోవడం కాదా అనివిలేకరులు పదే పదే అడిగిన ప్రశ్నలకుఇది కాశ్మీర్పై భారత్ వైఖరిని మార్చుకోవడంగానీ, నీరుగార్చడం గానీ కాదని ఆమె జవాబిచ్చారు.
Comments
Story first published: Thursday, June 28, 2001, 23:53 [IST]