దేశం, బిజెపి పోటాపోటీనామినేషన్లు
హైదరాబాద్: పంచాయతీరాజ్ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కోసం బిజెపి,తెలుగుదేశం పార్టీల మధ్య జరుగుతున్నచర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో ఎవరికివారే అన్నట్లు ఇటు బిజెపి అభ్యర్థులు, అటుతెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జిల్లా పరిషత్ప్రాదేశిక కమిటీ (జడ్పిటిసి)లకు నామినేషన్లువేస్తున్నారు. దాదాపు 15 జిల్లాల్లో ఇప్పటి వరకు రెండు పార్టీలుసీట్ల సర్దుబాటుపై ఒక నిర్ణయానికి రాలేకపోయాయి.నామినేషన్లు దాఖలు చేయడానికి ఒక రోజు మాత్రమేగడువు వుంది. బిజెపి అడుగుతున్న సీట్ల ఎక్కువగావున్నదని తెలుగుదేశం బిజెపి అడిగినన్నిసీట్లు ఇవ్వడానికి విముఖత చూపుతోంది. బిజెపిఅనవసర రాద్ధాంతం చేస్తోందనితెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రిఆయా జిల్లాల నాయకులతో ఫోన్లో మాట్లాడారు.
ఇవ్వాళ్ల రేపట్లోతెలుగుదేశం, బిజెపిల మధ్య జరుగుతున్నచర్చలు ఒక కొలిక్కి వస్తాయని, అవగాహనకుదిరిన తర్వాత నామినేషన్లను ఉపసింహరింపజేయడం బిజెపి నాయకులదే బాధ్యత అనితెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడుకె. ఎర్రంనాయుడు విలేకరులతో అన్నారు. తాము బిజెపినేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమిప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని, తాముపదవులు కూడా తీసుకోలేదని, అట్లని తామురాష్ట్రంలో బిజెపిని చిన్న చూపు చూడడంలేదని ఆయన అన్నారు. కర్నూలు, విశాఖపట్నంజిల్లాల్లో ఇరు పార్టీల మధ్య చర్చల్లో ప్రతిష్టంభనఏర్పడింది. దీంతో బిజెపి, తెలుగుదేశం అభ్యర్థులు తమ తమ ఇష్టానుసారంనామినేషన్లు వేస్తున్నారు.
కర్నూలు జిల్లాలోని 52 జడ్పిటిసిల్లో బిజెపి 25కోరుతోంది. అయితే, బిజెపికి అంత బలం లేకున్నా ఎక్కువసీట్లు అడుగుతోందని తెలుగుదేశం నాయకులువిమర్శిస్తున్నారు. అయితే, తమ అభ్యర్థుల గెలుపేతెలుగుదేశం విమర్శలకు సమాధానం చెప్పుతుందని బిజెపిఅంటోంది.
విశాఖపట్నంలో ఆరు జడ్పిటిసిలను బిజెపిఅడుగుతోంది. అయితే తెలుగుదేశం అందుకునిరాకరిస్తోంది. దీంతో చర్చల్లో ప్రతిష్టంభనఏర్పడింది. వరంగల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితినెలకొన్నది. పట్టులేని చోట బిజెపి సీట్లు అడిగితేఇచ్చేది లేదని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. తమకు బలం ఉన్నస్థానాలనే అడుగుతున్నామని బిజెపి వాదిస్తోంది.