వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఏలేరుపై కాంగ్రెస్ భారీ ర్యాలీ
హైదరాబాద్ః
ఏలేరు
భూ
కుంభకోణంపై
గతంలో
ఏర్పాటు
చేసిన
సోమశేఖర
కమిషన్
ను
రాష్ట్ర
ప్రభుత్వం
రద్దు
చేయడానికి
నిరసనగా
కాంగ్రెస్
మంగళవారం
భారీ
ప్రదర్శన
నిర్వహించింది.
హైదరాబాద్
సోమాజి
గూడలోని
రాజీవ్
గాంధీవిగ్రహం
నుంచి
రాజ్
భవన్
వరకు
ర్యాలీ
నిర్వహించారు.
పిసిసి
అధ్యక్షుడుఎం.
సత్యనారాయణ
రావు
ఈ
ర్యాలీకి
సారధ్యం
వహించారు.
తన
బండారం
బయటపడుతుందనే
చంద్రబాబు
నాయుడు
ఏలేరు
కుంభకోణంపై
సుప్రీంకోర్టు
సైతం
ఆమోదించిన
సోమశేఖర
కమిషన్
ను
అర్థాంతరంగా
రద్దు
చేసిందని
ఎమ్మెస్సార్
ధ్వజమెత్తారు.
ఏలేరు
కుంభకోణంపై
రాష్ట్ర
వ్యాప్తంగా
ఉద్యమం
చేపట్టి
చంద్రబాబు
నాయుడు
పనిపడతాం
అని
ఎమ్మెస్సార్
నినదించారు.
వామపక్ష
పార్టీలతో
త్వరలో
చర్చలు
నిర్వహించి
రాష్ట్ర
వ్యాప్తంగా
ఉమ్మడి
ఆందోళన
కార్యక్రమాన్ని
చేపట్టనున్నట్లు
ఆయన
చెప్పారు.
Comments
Story first published: Tuesday, August 7, 2001, 23:53 [IST]