వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రాన్స్‌కో టెలీకామ్‌ వ్యాపారం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌ ట్రాన్స్‌కో టెలీకామ్‌ రంగంలోకి పెద్దఎత్తున అడుగుపెట్టడానికి వీలుగా పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. మంగళవారం నాడు ట్రాన్స్‌కో ఎండి రమాకాంత్‌రెడ్డి, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ సిఎండి ఆర్‌పి సింగ్‌ సమక్షంలో రెండు సంస్థల ప్రతినిధులు అవగాహన పత్రాలపై సంతకాలు చేశారు.

ఒప్పందం ప్రకారం డిజిటల్‌ వాయిస్‌, డేటాట్రాన్స్‌మిషన్‌ రెండు సంస్థలు సంయుక్తంగా ఆప్టిక్‌ఫైబర్‌ కేబుల్‌ను వేస్తాయి. ఈ ప్రాజెక్టులో ట్రాన్స్‌కోకు 26 శాతం, పవర్‌గ్రిడ్‌కు 23 శాతం వాటా వుంటాయి.మిగిలిన 51 శాతం వాటాకోసం అంతర్జాతీయ భాగస్వామికోసం అన్వేషిస్తారు. టెలీకామ్‌ వ్యాపారానికి వెన్నెముక వంటి బాండ్‌విడ్త్‌ను సమకూర్చడానికి ఈ కేబుల్‌ నెట్‌వర్క్‌ ఉపకరిస్తుంది. తన సొంత అవసరాలకోసంట్రాన్స్‌కో ఇప్పటికే 11 జిల్లాలను కలుపుతూ ఆప్టిక్‌ఫైబర్‌ కేబుల్‌ను వేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X