ట్రాన్స్కో టెలీకామ్ వ్యాపారం
హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కో టెలీకామ్ రంగంలోకి పెద్దఎత్తున అడుగుపెట్టడానికి వీలుగా పవర్గ్రిడ్ కార్పొరేషన్తో ఒప్పందం కుదుర్చుకున్నది. మంగళవారం నాడు ట్రాన్స్కో ఎండి రమాకాంత్రెడ్డి, పవర్గ్రిడ్ కార్పొరేషన్ సిఎండి ఆర్పి సింగ్ సమక్షంలో రెండు సంస్థల ప్రతినిధులు అవగాహన పత్రాలపై సంతకాలు చేశారు.
ఒప్పందం ప్రకారం డిజిటల్ వాయిస్, డేటాట్రాన్స్మిషన్ రెండు సంస్థలు సంయుక్తంగా ఆప్టిక్ఫైబర్ కేబుల్ను వేస్తాయి. ఈ ప్రాజెక్టులో ట్రాన్స్కోకు 26 శాతం, పవర్గ్రిడ్కు 23 శాతం వాటా వుంటాయి.మిగిలిన 51 శాతం వాటాకోసం అంతర్జాతీయ భాగస్వామికోసం అన్వేషిస్తారు. టెలీకామ్ వ్యాపారానికి వెన్నెముక వంటి బాండ్విడ్త్ను సమకూర్చడానికి ఈ కేబుల్ నెట్వర్క్ ఉపకరిస్తుంది. తన సొంత అవసరాలకోసంట్రాన్స్కో ఇప్పటికే 11 జిల్లాలను కలుపుతూ ఆప్టిక్ఫైబర్ కేబుల్ను వేసింది.