తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం
చెన్నైః తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండో రోజు శనివారం నాడు సభలో తీవ్ర గందరగోళం నెలకొన్నది. తీవ్ర గందరగోళం, ప్రతిపక్షాల వాకౌట్ మధ్యనే 135 కోట్ల రూపాయలమేర అదనపు రాబడికి వడ్డనలతో తమిళనాడు ఆర్ధిక మంత్రి తమ బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు.
డిఎంకె అగ్రనేతను తమిళనాడు పోలీసులుఅరెస్టు చేసిన తీరుకు వ్యతిరేకంగా, ఈ మధ్య తమపార్టీనిర్వహించిన ర్యాలీ సందర్భంగా పోలీసులు సృష్టించిన బీభత్సనికి నిరసనగా డిఎంకె సభ్యులుపెద్దఎత్తున నిరసన తెలియజేస్తూ సభనుంచి వాకౌట్ జరిపారు. తొలుత డిఎంకె నేతలపై పోలీసుల జులుంకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జయలలితకు వ్యతిరేకంగా సభాహక్కుల తీర్మానం ప్రవేశపెట్టాలని డిఎంకె సభ్యులు పట్టుబట్టారు. అధికార పక్ష సభ్యులు కూడా అదే గట్టిగా అడ్డుతగలడంతో ఉభయ పార్టీలమధ్య తీవ్రస్థాయిలోవాగ్వివాదం జరిగింది.
ప్రభుత్వాన్నిఅస్థిరపర్చాలన్న ఏకైక ధ్యేయం మినహా ప్రజాస్వామికంగా, చట్టబద్దంగా తమ విధులను నిర్వహించాలన్న ఆసక్తి లేదని డిఎంకెపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తీవ్రంగా విరుచుకుపడ్డారు. కాగాబడ్జెట్లో కొత్తదనం ఏమాత్రం లేదని ప్రజలపైపెను భారం మోపడం తప్ప జయ సర్కారు కొత్తవిన్యాసం ఇందులో ఏమీ లేదని డిఎంకె నేత కరుణానిధి వ్యాఖ్యానించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications