కన్వర్జెన్స్బిల్లుకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీః
ఐటి,
టెలికామ్,
ప్రసార
రంగాలను
ఒకే
గొడుగుకిందకు
తెచ్చి
నియంత్రించడానికి
వెసులుబాటు
కల్పించే
కన్వర్జెన్స్
బిల్లుకు
కేంద్ర
మంత్రి
మండలి
ఆమోదం
తెలిపింది.
ప్రధాని వాజ్పేయి నేతృత్వంలో సోమవారం రాత్రి జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం వల్ల ఇప్పటివరకు అమల్లో వున్న టెలికామ్ రెగ్యులేటరీ అథార్టీ ఆఫ్ ఇండియా, కేబుల్, టెలిగ్రాఫ్ చట్టాలతో సహా మొత్తం ఐదు చట్టాలు రద్దయి కొత్తగా ఏర్పడే కన్వర్జెన్ చట్టంలోవిలీనమవుతాయి. కన్వర్జెన్స్ బిల్లును ఆమోదించాలనే నిర్ణయంతో పాటుఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సీనియారిటీ ప్రయోజనాలను పరిరక్షిస్తూ రాజ్యాంగంలోని 16(4ఎ) అధికరణను సవరించాలనే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉత్తరాంచల్లోని రూర్కీ ఇంజినీరింగ్ కాలేజీకి ఐఐటి హోదా కల్పించాలని కూడా నిర్ణయించారు. పోర్టుల ప్రైవేటీకరణకు అవరోధంగా వున్న ప్రస్తుత చట్టాలను సవరించాలని కూడా మంత్రి మండలి అభిప్రాయపడింది.