ప.గో.జి.కి అక్షరాస్యలో జాతీయ అవార్డు
న్యూఢిల్లీః
ఆంధ్రప్రదేశ్
లో
అత్యధికంగా
90
శాతం
అక్షరాస్యతను
సాధించిన
పశ్చిమ
గోదావరి
జిల్లా
జాతీయ
అవార్డుఅందుకుంది.
పశ్చిమగోదావరి
జిల్లా
కలెక్టర్
పునం
మాలకొండయ్య
శనివారం
ప్రధాని
వాజ్పేయి
చేతుల
మీదుగా
ఈ
అవార్డు
అందుకున్నారు.
50
వేల
మంది
వాలంటీర్లు
అహోరాత్రులు
శ్రమించిన
కారణంగానే
ఈ
లక్ష్యాన్ని
సాధించగలిగామని
పూనం
మాలకొండయ్య
ఈ
సందర్భంగా
చెప్పారు.
అంతర్జాతీయఅక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో పశ్చిమగోదావరి జిల్లాఅక్షరాస్యతా సాధనలో చేసిన కృషిని ప్రశంసించారు. జిల్లాలో ఓపెన్ బేసిక్ ఎడ్యుకేషన్ పధకాన్ని అమలు చేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రభుత్వం, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా తీసుకున్న శ్రద్ధ కారణంగా ఈ జిల్లా 90 శాతం అక్షరాస్యత సాధించింది. రాష్ట్రంలో అత్యధిక శాతం అక్షరాస్యత సాధించిన జిల్లాగా రూపుదిద్దడానికి ఎంతో శ్రమించనట్లు పూనం మాలకొండయ్యవివరించారు. ప్రభుత్వ సహకారంతో జిల్లాలో సంపూర్ణఅక్షరాస్య సాధిస్తామని ఆమె హామీ ఇచ్చారు.