వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఇద్దరి పాస్‌పోర్టులపై ఆరా

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌సెంటర్‌పై, పెంటగాన్‌పై జరిగిన దాడులకు సంబంధించిఅరెస్టయిన ఇద్దరు హైదరాబాదీల పాస్‌పోర్టులపై ఆరా తీస్తున్నారు. అనుమానితులుగా భావిస్తున్న మహ్మద్‌ అయూబ్‌ అలీఖాన్‌, మహ్మద్‌ జావీద్‌ అజ్మద్‌ల వివరాలు వెంటనే పంపాల్సిందిగా అమెరికా కాన్సులేట్‌ కార్యాలయం నగరంలోని ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం అధికారులను కోరింది. దీంతో అధికారులు ఆ ఇద్దరి పాత రికార్డుల దుమ్ము దులిపారు.వీరిలో ఒకరికి 1992లో పాస్‌పోర్టు జారీ కాగా, మరొకిరి పాస్‌పోర్టు ఇటీవలే రెన్యువల్‌అయినట్లు తేలింది.

పాత రికార్డులు పరిశీలిస్తున్న సమయంలో ఈ ఇద్దరిలో ఒకరు వేర్వేరుపేర్లు, చిరునామా, భిన్నమైన ఫొటోలతో పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు కనుగొన్నట్లు చెబుతున్నారు. దీనిపైపరిశోధన కొనసాగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X