వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జస్వంత్‌తో అబ్దుల్‌ సత్తార్‌ సంభాషణ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికాలో జరిగిన టెర్రిరిస్టుల దాడుల నేపథ్యంలో పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ మంత్రి అబ్దుల్‌ సత్తార్‌ శనివారం భారత విదేశాంగ మంత్రి జస్వంత్‌ సింగ్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. వారిద్దరి మధ్య పది నిమిషాల పాటు సంభాషణ జరిగింది. ఆగ్రా శిఖరాగ్ర సమావేశంవిఫలమైన తర్వాత ఇరు దేశాల విదేశాంగ మంత్రులు మాట్లాడుకోవడం ఇదే ప్రథమం.

తమ ప్రాంతంలోని పరిస్థితిమీద ఇద్దరు మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు చెప్పాయి. ప్రస్తుత పరిస్థితిలో భారత్‌ ఏ విధమైన సమస్యలు సృష్టించబోదని పాక్‌ అధ్యక్షుడుపర్వేజ్‌ ముషారఫ్‌కు తన మాటగా చెప్పాలని జస్వంత్‌ అబ్దుల్‌ సత్తార్‌కు తెలియజేశారు. ప్రస్తుతం పాకిస్థాన్‌ ఎదుర్కుంటున్న మానసిక ఒత్తిడిని తాముఅర్థం చేసుకోగలమని ఆయన అన్నారు.

అమెరికాలో దాడులు జరిగిన నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించడానికి అబ్దుల్‌ సత్తార్‌ జస్వంత్‌ సింగ్‌తో మాట్లాడారని పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ కార్యాలయ అధికార ప్రతినిధి రియాజ్‌ మహమ్మద్‌ఖాన్‌ ఇస్లామాబాద్‌లో చెప్పారు. తీవ్రవాదాన్ని అంతం చేసేందుకు ప్రపంచంతో పాకిస్థాన్‌ చేతులు కలుపుతుందని సత్తార్‌జస్వంత్‌తో చెప్పారు.

జస్వంత్‌ సింగ్‌ ఇజ్రాయిల్‌ డిప్యూటీ ప్రధాని, విదేశాంగ మంత్రి షిమన్‌పెరెస్‌తో కూడా మాట్లాడారు. మధ్య ప్రాచ్య దేశంలోని పరిణామాలపై వారివురు మాట్లాడుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X