వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎటూ తేలని భారతీయుల సంఖ్య

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌ః న్యూయార్క్‌ ప్రపంచవాణిజ్య సంస్థపై టెర్రరిస్టుల దాడిలో మరణించిన భారతీయుల సంఖ్య ఇప్పటివరకు ఖచ్చితంగా తేలలేదు.

శిథిలాల నుంచి వెలికితీసిన మృతదేహాలను బట్టి మృతుల్లో ఇద్దరు మాత్రమే భారతీయులు వున్నారు. మరో 91 మంది గల్లంతయ్యారు. మరో 120 మంది లెక్కకు తేలడం లేదని అధికారులు చెబుతున్నారు. డబ్లుటిసి ఘటనలో మరణించిన వారి సంఖ్య తాజావివరాల ప్రకారం 6574 అని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. న్యూయార్క్‌ దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో 77 మంది భారతీయులు చికిత్సపొందుతున్నట్టుగా అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వర్గాలు తెలిపాయి.

అధికారులు చెబుతున్నవివరాల ప్రకారం ఇప్పటివరకు 102వ అంతస్తులోని విండో ఆఫ్‌ ది వరల్డ్‌ రెస్టారెంట్‌ మానేజర్‌ జూపిటర్‌ యాంబె, జోసఫ్‌ మాథ్యూ అనే ఇద్దరు భారతీయులు వున్నారు. రెస్టారెంట్‌ మృతుల్లో యాంబేతో పాటు బంగ్లాదేశ్‌కు చెందిన హోటల్‌ కార్మికులు 30 మంది వున్నట్టుగా చెబుతున్నారు. డబ్లుటిసి మృతుల్లో 63 దేశాలకు చెందిన వారు వున్నారు.అందరికంటే పెద్ద సంఖ్యలో బ్రిటన్‌కు చెందిన 250 మంది ఈ ప్రమాదంలో మరణించినట్టుగా భావిస్తున్నారు. జర్మనీ జాతీయులు 150 మంది, కెనడా పౌరులు 50 మంది, జపాన్‌ వారు పాతిక మంది వుంటారని భావిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X