పిసిసి నేత ఢిల్లీ యాత్ర

న్యూఢిల్లీః రాష్ట్ర కాంగ్రెస్‌ కమిటీ నేత సత్యనారాయణరావు మరోసారి బుధవారం నాడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ సారి ఎట్టిపరిస్థితిలోనూ జిల్లా కాంగ్రెస్‌ కమిటీల అధ్యక్షులు, కార్యదర్శుల జాబితాతోనే తిరిగివస్తానని ఆయన తన సహచరులకు గట్టిగా చెప్పినట్టు తెలిసింది.

ఇప్పటికి ఆయన ఈ పనిమీద ఢిల్లీకి కనీసం పదిసార్లు వెళ్లివుంటారు. వెళ్లడానికి ముందు జాబితాతోనే వస్తానని చెప్పడం ఉత్తచేతులతో, బిక్కమొహంతో రావడం, ఆయనకు ఆయన్ను అలా చూడ్డం ఆయన సహచరులకు అలవాటయింది. అయితే ఈ సారి అలాకాదని ఆయనఅంటున్నారు. ముందుగానే అధిష్టాన వర్గం నేతలతో గట్టిగా మాట్లాడి జాబితా ఖరారు చేయించానని ఆయన చెప్పుకుంటున్నారు.విశాఖ, చిత్తూరు, ఖమ్మం వంటి వివాదాస్పద జిల్లాలుమినహా మిగిలిన జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు నియామాకం ఈ నెలాఖరు కల్లా ఎట్టిపరిస్థితిలో పూర్తయితీరుతుందని ఆయనఅంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+