ఆంధ్రలో వెలుగురేఖకు శ్రీకారం
నెల్లూరుఃస్వయం సహాయ గ్రూపులకు బీమా సౌకర్యం కల్పించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి యశ్వంత్ సిన్హా ప్రకటించారు. చేతివృత్తి పనివారు, డ్వాక్రా గూపులకు బహుళ ప్రయోజనాలు చేకూర్చే వేలుగురేఖ పథకాన్ని యశ్వంత్ సిన్హా బుధవారం నెల్లూరులో ప్రారంభించారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కలిపి వేలుగు రేఖ పథకంగా రూపొందించారు. ముఖ్యంగా చేతివృత్తులు, డ్వాక్రా గ్రూపులకు ఈ పధకం ఎంతగానో ఉపయోగపడుతుందని యశ్వంత్ సిన్హా వెల్లడించారు.
డ్రాక్రా పథకంవిషయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా వున్నదని ఆయన అన్నారు. మహిళావికాసానికి తోడ్పడే ఈ పథకాన్ని అంకితభావతం అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని యశ్వంత్ సిన్హా ప్రశంసించారు. యశ్వంత్ సిన్హా ఈ సందర్భంగా లబ్ది దారులకు రుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు, డ్వాక్రా మహిళలకు బీమా యోజన సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిఎం. వెంకయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.