చర్చలతోనే కాశ్మీర్ పరిష్కారం
ఇస్లామాబాద్ః
జమ్మూ
కాశ్మీర్
సమస్యను
భారత్
పాకిస్తాన్
సామరస్యంగా
చర్చల
ద్వారా
పరిష్కరించుకోవాలని
అమెరికా
విదేశాంగ
మంత్రి
కొలిన్
పావెల్
సూచించారు.
కాశ్మీర్
సమస్య
పరిష్కారంలో
టెర్రరిజానికి
చోటు
లేదని
ఆయన
ప్రకటించారు.
పాకిస్తాన్
పర్యటనకోసం
వచ్చిన
పావెల్
మంగళవారం
నాడు
పాకిస్తాన్
అధ్యక్షుడు
జనరల్
ముషారఫ్తో
కలసి
సంయుక్తంగావిలేకరుల
సమావేశంలో
పాల్గొన్నారు.
భారత్-పాకిస్తాన్
మధ్య
సంబంధాల్లో
కాశ్మీరే
కీలకాంశమని
పావెల్
అన్నారు.అక్టోబర్
ఒకటిన
కాశ్మీర్
అసెంబ్లీపై
టెర్రరిస్టుల
దాడిని
తీవ్రంగా
ఖండించిన
జనరల్
ముషారఫ్ను
తాను
అభినందిస్తున్నట్టుగా
ఆయన
చెప్పారు.
ప్రస్తుత
దశలో
చర్చలు
అత్యంత
కీలకమైనవన్నవిషయం
ఉభయదేశాలు
గుర్తించాలని
సలహా
ఇచ్చారు.
న్యాయాన్ని నిరాకరించడం, అణిచివేత ఈ రెండే ప్రపంచంలో ఎక్కడైనాసరే ఉగ్రవాదం వేళ్లూనుకోవడానికి కారణమని కాశ్మీర్అంశాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ పాకిస్తాన్ అధినేత జనరల్ ముషారఫ్ వ్యాఖ్యానించారు. పావెల్తో చర్చల్లో కాశ్మీర్ ప్రజల మనోభిష్టానికి అనుగుణంగా కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని తాము స్పష్టం చేసినట్టుగా ఆయన వెల్లడించారు. కాశ్మీర్ సమస్యనే ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతకు ప్రధాన కారణమని కూడా ఆయన వెల్లడించారు.
గత కొద్ది వారాలుగా నెలకొని వున్నసంక్షోభంలో పాకిస్తాన్ సాహసోపేతంగా వ్యవహరించి అమెరికాకు దన్నుగా నిలబడటం పట్ల పావెల్ కృతజ్ఞతలు తెలిపారు. పాకిస్తాన్ ప్రభుత్వం చర్యలు తమ ఉభయ దేశాల సంబంధాల్లో కొత్తశకానికి నాంది కాగలవని అన్నారు. తాలిబన్ల పతనానంతరం ఏర్పడేఅఎn్గాన్ ప్రభుత్వం ఆ దేశంలోని అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించేదై వుండాలని అమెరికా, పాకిస్తాన్ భావిస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు.