రాజమండ్రిలో ఉన్మాది ఘాతుకం
రాజమండ్రిః
రాజమండ్రిలో
ఉన్నాద
స్థితిలో
వున్న
ఒక
యువకుడు
మంగళవారం
పట్టపగలు
నడిరోడ్డుపై
స్వైరవిహారం
చేసి
ఇద్దరిని
కత్తితో
దారుణంగా
పొడిచి
చంపాడు.
ఈ
ఉన్మాది
దాడిలో
మరో
పదిమంది
తీవ్రంగా
గాయపడ్డారు.
బాగా
రద్దీగా
వుండే
కుమార్
టాకీస్,
శ్యామలా
టాకీస్
సెంటర్లలో
సుమారు
గంటసేపు
ఈ
ఉన్మాది
బీభత్సం
సృష్టించినట్టు
స్థానికులు
వెల్లడించారు.ె
చతిలో కత్తితో చెలరేగిపోతున్న ఉన్మాదిని నిలువరించేందుకు స్థానికులు రాళ్లతో తీవ్రంగా కొట్టారు.అపస్మారక స్థితిలో ఆ యువకున్ని పోలీసులు అరెస్టు చేసి తీసుకుపోయారు.తొలుత ఈ ఉన్మాది గోదావరి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి వద్దకు వెళ్లి అక్కడ వెదురు నిచ్చెనలు తయారు చేసుకునే ఆకుల రాము అనే వ్యక్తి వద్దకు వెళ్లి అతనినుంచే కత్తి లాక్కుని నాలుగుసార్లు బలంగా నరికినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు.
ఈ దాడిలో రాములు అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత అక్కడికి సమీపంలోని దేవాలయంలో కొబ్బరికాయలు అమ్ముకుంటున్న దాసరి నారాయణరావు అనే వ్యాపారిపై దాడి చేసి నరికి చంపాడు. ఆ తర్వాత దారినపోయే వారిపై ఎడాపెడా దాడిచేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సన్యాసిరావు అనే వ్యక్తి పరిస్థితి ప్రమాదకరంగా వుంది. ఈ దశలో స్థానికులు రాళ్లతో ఎదురుదాడి జరపడంతో ఉన్మాద స్థితిలో వున్న యువకుడు సృహతప్పిపడిపోయాడు.