సరైన పనికి పాక్ ఖర్చుపెట్టాలి
న్యూఢిల్లీ: ఇస్లామాబాద్ తీసుకునే ఆర్థిక సహాయాన్ని న్యాయమైన ప్రయోజనం కోసం ఖర్చుపెట్టగలదనే ఆశాభావాన్ని భారత్ వ్యక్తం చేసింది. పాకిస్థాన్పై మరిన్ని ఆంక్షలను అమెరికా తొలగించడానికి రంగం సిద్ధమవుతున్న సమయంలో భారత్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. తనకు అందే ఆర్థిక సహాయాన్ని పాకిస్థాన్సరైన ప్రయోజనానికి ఖర్చు చేయగలదని తాము ఆశిస్తున్నామని, అయితే ఈవిషయాన్ని తేల్చుకోవాల్సింది పాకిస్థానే అని విదేశీ వ్యవహారాల మంత్రి జస్వంత్ సింగ్ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి కొలిన్ పావెల్తో పాటు సంయుక్తవిలేకరుల సమావేశంలో జస్వంత్ మాట్లాడారు.
గతంలో అమెరికా పాకిస్థాన్కు చేసిన సైనిక సహాయ పరిణామాలను భారత్ ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. పాకిస్థాన్కు అమెరికాసైనిక సహాయం చేసినప్పుడు తాము ఎదుర్కున్న అనుభవాలు ఉన్నాయని ఆయన చెప్పారు.
పాకిస్థాన్కు అమెరికా చేస్తున్న సహాయం వల్ల అమెరికా, భారత్ల మధ్య సంబంధాలు చెడిపోవని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అమెరికా, భారత్లు రెండు కూడాసార్వభౌమాధికారం గల దేశాలని ఆయన అన్నారు.