ప్రపంచయుద్ధం ఖాయం
బెంగుళూరుః వచ్చే ఫిబ్రవరి 28న తృతీయ ప్రపంచయుద్ధం ప్రారంభమవుతుంది. తృతీయప్రపంచయుద్ధంతో అమెరికాలోని ప్రతివీధి అగ్నిగుండంగా మారుతుంది. అదే సమయంలో భారత పాకిస్తాన్ యుద్ధం కూడా బద్దలవుతుంది.
ఇవన్నీ ఊహలు కాదు. బెంగుళూరుకు చెందిన ప్రముఖ జ్యోతిష్యులు బాలగోపాల్ జోస్ కొప్పాఅంచనాలు. ఈ వివరాలను విజయ కర్ణాటక అనే కన్నడ దినపత్రిక ప్రచురించింది. కూర్గ్ జిల్లా మడికెరికి చెందిన బాలగోపాల్ లెక్కల ప్రకారం ప్రస్తుతఅఎn్గాన్ యుద్ధం 2007 నవంబర్ 13 వరకు కొనసాగుతుంది. ముస్లీంలు, క్రిస్టియన్లు ఈ యుద్ధంలోఘోరంగా దెబ్బతింటారు.
ఈ సుదీర్ఘ యుద్ధంలో అమెరికా మాత్రం ఎవరికోసమైతే ఈ యుద్ధాన్ని ప్రారంభించిందో ఆ ఒసామాబిన్ లాడెన్ను పట్టుకోవడంలో పూర్తిగా విఫలమవుతుంది. కాశ్మీర్అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చే ఏడాది మార్చి నుంచి భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరుగుతుందని ఈ యుద్ధంలో భారత్విజేతగా నిలుస్తుందని ఆయన వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యగా జ్యోతిష్యాన్ని నూటికి నూరుపాళ్లు కరెక్ట్ అనిస్వీకరించడానికి లేదని 80 శాతం మాత్రం ఖచ్చితంగా వుంటుందని ఆయన వెల్లడించారు.